టాలీవుడ్ లో కీర్తి సురేష్ బాగానే పాపులర్ అయింది. అయితే స్టార్ హీరోయిన్ అన్న ఇమేజ్ కి మాత్రం ఆమడ దూరంలోనే ఉంది. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన కీర్తి సురేష్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ని అందుకుంది. ఆ తర్వాత నేను లోకల్ సినిమాలోను నటించింది. ఈ సినిమా కూడా మంచి సక్సస్ ని అందుకుంది. ఆ తర్వాత మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి సినిమాలో నటించింది. వాస్తవంగా మొదటి రెండు సినిమాలకంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని అందరూ అనుకున్నారు.

 

కాని అందరి అంచనాలను తారుమారు చేస్తూ భారీ డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఈ సినిమా తర్వాత వచ్చిన మహానటి సినిమా మాత్రం కీర్తి సురేష్ కి ఎంతో కీర్తిని తెచ్చిపెట్టింది. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈ సినిమా తన కెరీర్ లో ఒక గొప్ప సినిమాగా నిలిచిపోయింది. అయితే ఆ తర్వాత మాత్రం ఎందుకనో తెలుగు సినిమాలలో కీర్తి నటించలేదు. నాగార్జున నటించిన మన్మధుడు 2 లో చిన్న పాత్ర చేసినప్పటికి అది ఎవరికీ తెలీదు.

 

అయితే మళ్ళీ ఇన్నాళ్ళకి నితిన్ హీరోగా తెరకెక్కుతున్న రంగ్ దే సినిమాలో నటిస్తుంది. అంతేకాదు నితిన్ తోనే మరో సినిమాను చేయనుందని సమాచారం. అంతేకాదు సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురాం కాంబినేషన్ లో తెరకెక్కబోయో సినిమాలో కూడా కీర్తి సురేష్ ని అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగానే కీర్తి సురేష్ మరో బయోపిక్ లో నటిస్తుందన్న వార్తలు గుప్పుమన్నాయి.

 

కృష్ణ సతీమణి దర్శకురాలు, నటి విజయ నిర్మల బయోపిక్ లో నటించబోతుందన్న న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. అయితే అది వాస్తవం కాదని సమాచారం. ఇప్పటి వరకి అలాంటి ప్రతిపాదన కీర్తి సురేష్ వద్దకు రాలేదని తెలుస్తుంది. ఉత్తుత్తి గాసిప్స్ తో ముంచేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: