విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో కలసి నటించిన మల్టీస్టారర్ 'ఎఫ్ 2'. 'ఫన్ అండ్ ఫ్రస్టేషన్' అనేది క్యాప్షన్ అన్న సంగతి తెలిసిందే. 'పటాస్', 'సుప్రీమ్', 'రాజా ది గ్రేట్' వంటి కమర్షియల్ హిట్ సినిమాలు తెరకెక్కించిన అనిల్ రావిపూడి 'ఎఫ్ 2' ని తెరకెక్కించగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని 100 కోట్ల క్లబ్ లో చేరిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ సక్సస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ సినిమాని నిర్మించారు.  

 

సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పుడే సీక్వెల్ ని నిర్మించాలని దిల్ రాజు నిర్ణయించుకున్నారు. అప్పుడే దర్శకుడు అనిల్ రావి పూడి కూడా ఎఫ్ 3 కి లైన్ చెప్పగా దిల్ రాజు కి విపరీతంగా నచ్చి ఫుల్ స్క్రిప్ట్ రెడీ చెయమని చెప్పారు. ఇక రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడికి ఎఫ్ 3 స్క్రిప్ట్ సిద్దం చేయమనగా ప్రస్తుతం అనిల్ రావిపూడి అదే పనిలో బిజీగా ఉన్నాడు. 

 

ఇంకో రెండు వారాల్లో స్క్రిప్ట్ పనులు కూడా పూర్తవుతాయట. 'ఎఫ్ 2' సీక్వెల్ లో అందరూ అనుకున్నట్లు మూడో హీరో ఉండరని ఇప్పటికి అనిల్ రావిపూడి ఇటీవలే క్లారిటీ ఇచ్చాడు. 'ఎఫ్ 2' లో ఉన్న నటీనటులతో పాటు వారి పాత్రలు కూడా 'ఎఫ్ 3' లో కంటిన్యూ అవుతాయట. వెంకీవరుణ్ తేజ్ జీవితాలలో తరువాత జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సీక్వెల్ ఉంటుందని తాజా సమాచారం. అయితే ఈ సినిమాకి సంబంధిన మరిన్ని విషయాలు లాక్ డౌన్ తర్వాతే వెలువడనున్నాయని అనిల్ రావిపూడి క్లారిటి ఇచ్చారు. ఇక ఈ సినిమాను దిల్ రాజు తన బ్యానర్ లోనే నిర్మించనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: