కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దీని బారి నుంచి జనాలని రక్షించడం కోసం దేశాలన్నీ లాక్ డౌన్ విధించి వ్యవస్థలన్నింటిని స్విచ్ ఆఫ్ మోడ్ లోకి తీసుకెళ్లిపోయాయి. దీంతో ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. దీంతో సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఇంటికే పరిమితం అయిపోయారు. నిత్యం వరుస షూటింగ్ లతో బిజీగా గడిపేస్తూ ఫ్యామిలీలో గడిపేందుకే టైమ్ కేటాయించలేని స్టార్లు.. కరోనా పుణ్యమా అని తమ పూర్తి టైమ్ లాక్ డౌన్ కారణంగా ఫ్యామిలీకే కేటాయిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా పిల్లతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. కబుర్లు చెబుతున్నారు. పిల్లలతో కలిసి ఆటలాడుతున్నారు. పిల్లలతో పిల్లలుగా మారి సినిమాలు చూస్తూ వారిలో తమ ఆనందాన్ని చూసుకుంటున్నారు. నిత్యం షూటింగ్లతో బిజీగా గడిపేసే మాస్ రాజా రవితేజ లాక్ డౌన్ టైమ్ని తన పిల్లలతో గడిపేస్తున్నాడు. సోషల్ మీడియాలో ఫోటోలు చేస్తూ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నాడు.
తాజాగా రవితేజ తన కొడుకుతో కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఫొటోలో తండ్రీకొడుకులు ఇద్దరూ మొబైల్స్ చేతిలో పట్టుకొని ఉన్నారు. కొడుకు మహాధన్ మాత్రం మొబైల్ తో బిజీగా ఉండగా.. మాస్ మహారాజ్ మాత్రం తన కొడుకు వైపు చాలా సీరియస్ గా చూస్తున్నాడు. మహాధన్ మొబైల్ లో ఏమి చేస్తున్నాడో.. ఏమి చూస్తున్నాడో అని ఆలోచిస్తున్నాడేమో అన్నట్లు లుక్స్ ఉన్నాయి. 'చెకింగ్ ఆన్ మై DNK' అని కామెంట్ జతచేసి పోస్ట్ చేసాడు రవితేజ. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మొత్తం మీద రవిజేత ఈ లాక్ డౌన్ సమయాన్ని ఫ్యామిలీతో గడుపుతూ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. రవితేజ కుమారుడు మహాధన్ 'అమర్ అక్బర్ ఆంటోనీ' 'రాజా ది గ్రేట్' చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. రవితేజ ప్రస్తుతం 'క్రాక్' సినిమాలో నటిస్తున్నాడు. తన కెరీర్లో 66వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు.