టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో నానీ. టాలీవుడ్ లో ఇతనికి ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది. చిన్న చిన్న నిర్మాతల నుంచి పెద్ద నిర్మాతల వరకు ప్రతీ ఒక్కరు కూడా ఇతని తో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. నానీ తో సినిమా చేస్తే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉన్న నేపధ్యంలో అతని తో సినిమా చేయడానికి గానూ పెద్ద నిర్మాతలు కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అనేది టాలీవుడ్ జనాల మాట. ప్రస్తుతం నానీ మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. 

 

ఇక ఇది పక్కన పెడితే అతను ఇప్పుడు వ్యాపార రంగం మీద ఎక్కువగా దృష్టి పెట్టినట్టు సమాచారం. వ్యాపార రంగంలో అతను భారీగా పెట్టుబడులు పెట్టాలి అని భావిస్తున్నాడు. ఇందుకు గాను తన సొంత ప్రాంతం విశాఖలో పెట్టుబడులు పెట్టే ప్రయత్నాలు నానీ చేస్తున్నాడు అని టాలీవుడ్ లో ఇప్పుడు వార్తలు వినపడుతున్నాయి. అది ఎంత వరకు నిజం అనేది స్పష్టత లేదు గాని అతను మాత్రం రియల్ ఎస్టేట్ రంగం మీద ఎక్కువగా పెట్టుబడులు పెట్టే ఆలోచనలో ఉన్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆ రంగంలో అతను ఎక్కువగా పెట్టుబడి పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడని అంటున్నారు. 

 

ఒక నిర్మాతతో కలిసి విశాఖలో అతను భారీగా భూములను కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నాడని అన్నీ అనుకున్నట్టు జరిగితే అతను దాదాపు పది ఎకరాలను విదేశీ కంపెనీ కి విక్రయించే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. అక్కడ ప్రభుత్వం రాజధాని అంటుంది కాబట్టి మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటున్నాయి అనేది నానీ ఆలోచన. ఒకవేళ వాటిని అమ్మకపోయినా సరే అతనికి వచ్చే ఇబ్బంది ఏమీ లేకుండా పెట్టుబడులు పెట్టాలి అని చూస్తున్నట్టు సమాచారం. ఎక్కువగా ఇప్పుడు దీని మీద దృష్టి పెట్టాడని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: