టాలీవుడ్ లో ఇప్పుడు కొన్ని కొన్ని ఆశ్చర్యంగా మారాయి. అవి ఏంటీ అంటే కొందరు హీరోలు చేస్తున్న వ్యాపారాలు. లాభాలు ఉండటం తో మన తెలుగు హీరోలు ఇప్పుడు ఎక్కువగా వ్యాపారాల మీద దృష్టి పెడుతున్నారు. భారీ లాభాలు ఉండే రంగం మీద ఎక్కువగా పెట్టుబడులు పెడుతూ వస్తున్నారు హీరోలు. చిన్న హీరోల నుంచి కూడా ఇది ఉంది ఇప్పుడు సీనియర్ హీరోలు ఎక్కువగా పెట్టుబడుల మీద దృష్టి పెడుతున్నారు. ఒక్క సినిమాలను మాత్రమే నమ్ముకోవద్దని ఇతర రంగాల మీద కూడా దృష్టి పెడితే మంచిది అని అంటున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కువగా వ్యాపారాల మీద ఫోకస్ చేసిన వాళ్ళు ఉన్న్నారు. 

 

అందులో ప్రధానంగా చెప్పుకునేది రామ్ చరణ్. ఇతను విమానయాన రంగం మీద ఎక్కువగా పెట్టుబడులు పెట్టాడు ఆ రంగంలో అతనికి నష్టం వచ్చిందా లాభం వచ్చిందా అనేది పక్కన పెడితే అతను మాత్రం ఇప్పుడు ఆ రంగం మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు. మంచి పెట్టుబడులు పెడితే మంచి లాభాలు ఉంటాయి అనే విషయాన్ని గ్రహించిన అతను ఇప్పుడు అదే రంగం మీద మరిన్ని పెట్టుబడులు పెడితే మంచిది అని ఆలోచన చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆ రంగంలో అతను ఫుడ్ కి సంబంధించి కూడా పెట్టుబడులు పెట్టాలి అని చూస్తున్నాడు. 

 

అంటే విమానాల్లో ఎక్కువగా తిను బండారాల తో పాటుగా కొన్ని వస్త్రాలను కూడా విమానాల్లో విక్రయించాలని భావిస్తున్నట్టు సమాచారం. విదేశాల్లో దీనికి మంచి ఆదరణ వచ్చింది. అందుకే రామ్ చరణ్ తన సన్నిహితుల సలహాతో అక్కడ మరిన్ని పెట్టుబడులు పెట్టే ఆలోచనలో ఉన్నాడని సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించి తండ్రి చిరంజీవి ని కూడా అతను సలహాలు అడిగాడు అని అంటున్నారు. ఆయన కూడా ఆసక్తి చూపించారు అనేది టాలీవుడ్ టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: