మామూలుగా అయితే సినిమా హీరోయిన్లు అందరూ దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే నానుడిని ఫాలో అవుతూ ఉంటారు. ఎందుకంటే హీరోయిన్కు ఎప్పుడు క్రేజ్ తగ్గిపోతుందనే చెప్పలేని పరిస్థితి. కొత్త కొత్త హీరోయిన్లు వస్తుండడంతో ఎప్పుడు పోటీ నెలకొని ఉంటుంది. అందుకే చిత్ర పరిశ్రమలో తమ హవా నడిపించిన సమయంలోనే ఏదో ఒక బిజినెస్ ప్రారంభించి సెటిల్ అవ్వాలని హీరోయిన్లు భావిస్తూ ఉంటారు. ఇలా దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే నానుడికి కరెక్ట్ గా సరిపోయే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్ల పాటు తన హవాని నడిపించింది. దాదాపుగా చిన్న హీరోల నుంచి స్టార్ హీరోలు సీనియర్ హీరోలు అనే తేడా లేకుండా అందరు హీరోల సరసన నటించింది  ఈ ముద్దుగుమ్మ. 

 

 అందం చందం కలగలిపిన ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది దర్శక నిర్మాతలను ఆకర్షించి  వరుస అవకాశాలు దక్కించుకుంది. ఇక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. ఓ వైపు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే బాగా తెలివిగా ఆలోచించింది  ఈ ముద్దుగుమ్మ. ఏకంగా సైడ్ బిజినెస్ ప్రారంభించింది. ఎఫ్ 45 అనే కొత్త జిమ్ లను ప్రారంభించింది. ఇక వీటికి  ప్రమోషన్స్ కూడా బాగానే చేసింది ఈ ముద్దుగుమ్మ. మామూలుగా హీరోయిన్స్ కి  చిత్ర పరిశ్రమలో చాలా మంది ప్రముఖులు తెలిసే ఉంటారు.ఇక తాను కలిసి నటించిన హీరోలు కూడా పరిచయమే. 

 

 దీంతో ఆ హీరోలందరినీ తన జిమ్ కి  పిలిపించి ఏకంగా వ్యాయామం చేయిస్తూ ప్రమోషన్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇలా ఎఫ్ 45 జిమ్స్  పలు బ్రాంచ్ లను స్థాపించి ప్రస్తుతం బిజినెస్ ఉమెన్గా  కూడా దూసుకుపోతుంది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో బాగా హవా నడిపించిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఉన్న బిజినెస్ నాలెడ్జ్ వేరే హీరోయిన్ కు లేదు అని చెప్పాలి. ఏ  హీరోయిన్లు సైడ్ బిజినెస్  జోలికి వెళ్ళలేదు. కానీ రకుల్ మాత్రం ధైర్యం చేసి ఎఫ్  45 అనే జిమ్ బిజినెస్లో అడుగుపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: