సినిమా వారికి నటించడమే కాదు బిజినెస్‌లు చేయడం కూడా తెలుసు. హీరోలే కాదు హీరోయిన్లు కూడా బిజినెస్ చేస్తూ ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నారు. వాస్త‌వానికి కొంతమంది భామలు ఆఫర్లు లేక ఏమి చెయ్యని పరిస్థితిలో అంటువంటి సమయంలో బిజినెస్‌లు పెడుతున్నారు. కానీ, కొంద‌రు హీరోయిన్లు మాత్రం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకునే బాపతులో ఓవైపు బోలెడ‌న్నీ సినిమా ఆఫ‌ర్లు చేతులో ఉంచుకుని.. మ‌రోవైపు బిజినెస్‌లు చేస్తూ స‌త్తా చాటుతున్నారు. అయితే ఏదైనా బిజినెస్ అంటే అంత సులువు కాదు. పైగా ఎంతో అనుభవం ఉండాలి. 

 

అయితే అప్పటి వరకు అనుభవం లేకపోయినప్పటికీ, సన్నిహితుల సహకారంతో వ్యాపారాల్లో రాణిస్తున్నారు. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం.. తమకున్న బ్రాండ్‌ విలువ ఉపయోగపడుతుందనే ఉద్దేశం. ఈ క్ర‌మంలోనే చాలా మంది బిజినెస్‌లు స్టాట్ చేసి స‌క్సెస్ అయ్యారు. అలాంటి వారిలో హీరోయిన్ శ్రియ కూడా ఒక‌రు.వెండితెరపై తనకంటూ ప్రత్యేకత తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ చూడడానికి అమాయకంగా కనిపిస్తూ అభిమానుల మనసులను తన అందచందాలతో కొల్లగొడుతూనే ఉంటుంది. ఇష్టం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రియ తరువాత స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. 

 

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్‌బాబు, ప్రభాస్, రవితేజ.. ఇలా స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అయితే ఈమె బిజినెస్ చేస్తూ ఓ గొప్ప ప‌ని చేయ‌డం అంద‌రికీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తుంది. శ్రియ ముంబాయిలో 2011లోనే సొంతంగా శ్రీ స్పా పేరుతో సెంటర్‌ నెలకొల్పారు. ఇందులో వచ్చే లాభాల్లో కొంత భాగాన్ని అంధులకు అందచేయ‌డం నిజంగా విశేష‌యంగా చెప్పుకోవాలి. అంతేకాకుండా.. ఆమె న‌డిపించే స్పా సెంట‌ర్‌లో అంధులు పనిచేస్తుండడం మ‌రో విశేషం. నిజంగా శ్రేయ స్పా సెంట‌ర్ న‌డుపుతూ.. అంధుల‌‌కు త‌న వంతు సాయం చేయ‌డంతో చాలా మంది మెచ్చుకుంటుంటారు.. వాస్త‌వానికి చాలా త‌క్కు‌వ‌లో త‌క్కువ మంది మాత్రమే.. త‌మ కొచ్చిన లాభాల్లో లేని వారికి.. ఇత‌రిత‌రుల‌కు యూజ్ చేయాల‌నుకుంటారు. అందులో మ‌న టాలీవుడ్ హీరోయిన్‌ శ్రియ కూడా ఉండ‌డం గొప్ప విష‌యం.

మరింత సమాచారం తెలుసుకోండి: