టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీ హీరో బాలకృష్ణ ఓ వైపు రాజకీయాలు మరోవైపు సినిమాల్లో బిజీగా ఉంటున్నారు.  ఆ మద్య క్రిష్ దర్శకత్వంలో తన తండ్రి ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ‘ఎన్టీఆర్ బయోపిక్’ నిర్మించారు.  ఇది రెండు భాగాలుగా ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు గా రూపొందించారు.  కానీ ఈ రెండు మూవీస్ సక్సెస్ కాలేదు.  అంతకు ముందు మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా వచ్చిన ‘మహానటి’ సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత బాలయ్య ‘రూలర్’ మూవీతో వచ్చాడు.. కానీ ఇది కూడా అనుకున్న విజయం సాధించలేక పోయింది. ప్రస్తుతం నందమూరి నట సింహం బాలకృష్ణ  బోయపాటి శ్రీను సినిమా లో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తుంది.

 

ఇక ఈ నట సింహం  సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.  గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ మూవీస్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఈ కారణంతోనే బోయపాటి దర్శకత్వం లో సినిమా కావడంతో ఈ అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక వార్త సినీ వర్గాల్లో చెక్కర్లు కొడుతుంది. బాలయ్యకు ప్రక్కనే ఎప్పుడు ఒక వ్యక్తి ఉంటాడంట.  ఆ పాత్రా కోసం ఓ యంగ్ హీరో ను తీసుకున్నారంట చిత్ర బృందం.

 

ఇంతకీ ఆ యంగ్ హీరో ఎవరా అనుకుంటున్నారా.. ఈ మద్య 'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాలో డిటెక్టివ్ గా కనిపించి మంచి విజయం అందుకున్న నవీన్‌ పొలిశెట్టి అంటున్నారు.  అంతే కాదు ఈ మూవీలో మనోడి పాత్ర చాలా కీలకం అని అంటున్నారు.  ఇక ఈ సినిమా వారణాసి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. లాక్ డౌన్ ముగిసిన తర్వాత షూటింగ్ వేగవంతంగా కంప్లీట్ చేయబోతున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: