అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన విజయ్ దేవరకొండ, ఆ తర్వాత వచ్చిన గీత గోవిందం సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దాంతో అతడి రేంజ్ పూర్తిగా మారిపోయింది. అభిమానుల్లో విజయ్ సినిమా అంటే అంచనాలు కూడా పెరిగిపోయాయి. అయితే ఆ అంచనాలని అందుకోవడంలో విజయ్ విఫలం అవుతున్నాడు. వేగంగా దూసుకెళ్తున్న అతని కెరియర్ డియర్ కామ్రేడ్ రూపంలో బ్రేక్ పడింది.

 


ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కూడ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దాంతో విజయ్ స్పీడు కొంచెం తగ్గింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది. ప్రస్తుతం కరోనా కారణంగా సినిమా షూటింగ్ నిలిచిపోయింది. అయితే ఈ సినిమా తర్వాత విజయ్ సినిమా ఏ దర్శకుడితో ఉంటుందనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. 

 


మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. దిల్ రాజు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తాడని అన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే విజయ్ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఉంటుందని అంటున్నారు. గతంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో విజయ్ దేవరకొండ హీరో సినిమా స్టార్ట్ చేశాడు. కానీ అది సగం కూడా పూర్తి కాకముందే మధ్యలో ఆగిపోయింది.

 

ఇప్పటికే ఈ సినిమాకి ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయట. అందువల్ల మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని విజయ్ తో పూర్తి చేద్దామని భావిస్తుందట. విజయ్ కూడా ఈ సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడట. కరోనా వల్ల అన్ని పరిస్థితులు మారిపోవడంతో మధ్యలో ఆగిపోయిన సినిమాని కంప్లీత్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. మరి ఈ విషయమై అధికారిక సమాచారం వస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: