బేసిక్ గా బాలీవుడ్ హీరోయిన్లు అయినా.. తెలుగు ప్రేక్షకులకు బాగా  పరిచయం అయిపోయారు కియారా అద్వానీ, దిశా పఠానీ. కియారా అద్వానీ బాలీవుడ్ లో సినిమా చేసినా అక్కడ అంతగా ఎక్స్ పోజర్ రాలేదు. మన మేకర్స్ కన్నుపడి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిందో లేదో .. ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయిందికియారా. కియారా తెలుగులో మహేష్ బాబుతో కొరటాల డైరెక్షన్లో భరత్అను నేను సినిమా చేసింది.  ఈ సినిమాలో క్యూట్ గా కనిపించింది. మహేష్ తో పెయిర్ సూపర్ గా ఉండడంతో అందరి కాన్సన్ ట్రేషన్ కియారా మీదనే పడింది.

 

మహేష్ సినిమా తర్వాత నెక్ట్స్ సినిమా రామ్చరణ్ తో వినయవిధేమరామా చేసింది. ఆ సినిమా ఆడకపోయినా.. అమ్మాయి గారి యాక్టింగ్ కి ఫిదా అయ్యారు అందరూ. ఒక ఇక్కడ రెండు సినిమాలు చేసిందో లేదో.. వరుసగా  బాలీవుడ్ లో ఆఫర్లొచ్చేశాయి. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్  చేసి బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది.  ఆ తర్వాత గుడ్ న్యూస్ కూడా సూపర్ హిట్ అవ్వడంతో బాలీవుడ్ లో బిజీ అయ్యింది. అయితే ఈ మద్య .. తెలుగు నుంచి ఆఫర్లు వస్తుంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అడుగుతోందని, అందుకే మనవాళ్లు కియారా ను సినిమాలోకి తీసుకోవట్లేదన్న టాక్ నడుస్తోంది. బట్.. కియారా మాత్రం టాలీవుడ్ నాకెప్పుడూ స్పెషలే . అసలు తెలుగు సినిమాలకు రెమ్యూనరేషన్ పెద్దగా పట్టించుకోను. బాలీవుడ్ లో బిజీగా ఉన్నాను అందుకే తెలుగు సినమాలు చెయ్యలేకపోతున్నాను. త్వరలోనే మళ్లీ తెలుగులో సినిమా చేస్తాను అని క్లారిపై చేసింది క్యూట్ భామ కియారా.

 

కియారా నే కాదు .. మరో బాలీవుడ్ భామ .. దిశా పఠానీ కూడా టాలీవుడ్ అంటే నాకు ప్రేమ అంటోంది. వరుణ్ తేజ్ హీరోగా.. పూరీజగన్ డైరెక్షన్ లో వచ్చిన లోఫర్ మూవీలో  హీరోయిన్ గా యాక్ట్ చేసింది. పూరీ హీరోయిన్లందరూ బ్యూటిఫుల్ గా ఉంటారు. బట్..అందరిలోకీ .. దిశామాత్రం స్పెషల్ . లోఫర్ లో క్యూట్ యాక్టింగ్ కి ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయిపోయారు. కానీ సినిమా అనుకున్నంత  హిట్ అవ్వకపోవడంతో దిశాకి పెద్ద ఆఫర్లు రాలేదు. ఈమద్య ..  ఓ ఇంటర్వ్యూ లో  అసలు తెలుగులో సినిమాలుమానేశారేంటి అని అడిగితే.. చ.. అలాంటిదేం లేదు.. నాకు టాలీవుడ్ లో సినిమాలు చెయ్యలని ఉంది. కానీ లోఫర్ పెద్దగా  ఆడలేదుకాబట్టి..నన్ను పెద్దగా పట్టించుకోలేదు. కానీ..నాకు తెలుగులో అవకాశం వస్తే..తప్పకుండా చేస్తా అంటోంది దిశా. ఈ భామ ప్రస్తుతం స్టార్ హీరోలతో పాటు , స్పెషల్ సాంగ్స్ తో బాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: