టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకుంటున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకుంటున్నారు. ఈ ఏడాది అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆయన నెక్ట్స్ మూవీ ఎవరితో అనుకుంటున్న సమయంలో మొదట త్రివిక్రమ్ పేరు వినిపించింది. కానీ త్రివిక్రమ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఫిక్స్ అయ్యారు.  ఈ నేపథ్యంలో గీతా గోవిందం తో హిట్ అందుకున్న పరుశరామ్ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి మహేశ్ బాబు రెడీ అవుతున్నాడు. లాక్  డౌన్ తీసేసిన తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.  ఈ మూవీ మంచి లవ్ స్టోరీతో రన్ అవుతుందని అంటున్నారు.  

 

సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. దాదాపు రెండేళ్ల తరువాత ఆ  సినిమా ప్రేక్షకుల ముందుకు రావొచ్చని చెప్పుకుంటున్నారు. సాధారణంగా రాజమౌళి అంటే చాలా టైమ్ తీసుకుంటారని అంటుంటారు.  ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఆర్ఆర్ఆర్ మూవీ తీస్తున్న విషయం తెలిసిందే.  ఈమూవీ పూర్తి కావాల్సి ఉన్నా.. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతుంది.  సినిమా షూటింగ్స్ పూర్తిగా వాయిదా పడ్డాయి.. దాంతో సెలబ్రటీలు అందరూ ఇంటిపట్టున ఉంటున్నారు.  

 

అయితే రాజమౌళితో మహేష్ బాబు సినిమా రెండేళ్ల గ్యాప్ పడుతుందని అంటున్నారు. దాంతో మహేశ్ బాబు మరో సినిమా చేయడేమోనని అభిమానులు నిరాశకి లోనయ్యారు. కాకపోతే   మహేశ్ బాబు గ్యాప్ రాకుండా చూసుకుంటున్నాడట.  రాజమౌళి కథ రెడీ చేసి సెట్స్ పైకి వెళ్లే లోగా  అనిల్ రావిపూడి సినిమాను కూడా మహేశ్ బాబు పూర్తిచేసే ఆలోచనలో వున్నాడట.   ఈ ఏడాదిలో పరశురామ్ సినిమాను .. వచ్చే ఏడాదిలో అనిల్ రావిపూడి మూవీని తర్వాత రాజమౌళితో రెడీ అయ్యే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: