టాలీవుడ్ లో ఇప్పుడు రష్మిక మంధన హవా ఎక్కువగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆమె తో సినిమా చేయడానికి గానూ ఎందరో దర్శక నిర్మాతలు ఈ మధ్య కాలంలో ఆసక్తి ఎక్కువగా చూపిస్తూ వస్తున్నారు. ఆమె సినిమాలకు మంచి రేజ్ ఉంటున్న నేపధ్యంలో అభిమానులు కూడా ఆసక్తి చూపిస్తున్న తరుణంలో ఆమెతో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కమర్షియల్ సినిమాల మీద ఇప్పుడు టాలీవుడ్ ఎక్కువగా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు రష్మిక ను ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారట టాలీవుడ్ జనాలు. 

 

రష్మిక కమర్షియల్ హీరోయిన్ గా గీత గోవిందం తోనే గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత ఆమె వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది. అగ్ర హీరోలతో ఆమె సినిమాలు చేసి వరుస విజయాలు సాధిస్తుంది. ప్రస్తుతం మన తెలుగులో ఆమె వరుసగా సినిమాలు చెయ్యాలి అని చూస్తుంది. ఇక ఇప్పుడు ఆమె తో సినిమా చేయడానికి గానూ... రాజకీయ నాయకుడు ఒకరు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఆమె తో సినిమా చేయడానికి గానూ ఏపీ ఎమ్మెల్యే ఒకరు ప్రయత్నాలు చేస్తున్నారని ఆ సినిమా మీద రష్మిక మంధన కూడా ఆసక్తి చూపిస్తుంది అని టాక్. 

 

ఆ రాజకీయ నాయకుడికి మంచి క్రేజ్ ఉందని అందుకే ఆమె ఆసక్తి చూపిస్తుంది అంటున్నారు. సదరు నాయకుడు గతంలో కూడా సినిమాల పెట్టుబడుల మీద ఆసక్తి చూపించారు. ఇప్పుడు ఆమె కు భారీ పారితోషికం ఇవ్వడానికి కూడా సదరు నిర్మాత అయిన రాజకీయ నాయకుడు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. మరి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం అమే అల్లు అర్జున్ తో ఒక సినిమా చేస్తుంది. పుష్ప అనే టైటిల్ తో ఈ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: