కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ,మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తన్న బాక్సర్ లో నటిస్తున్నాడని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే మేకర్స్ నుండి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు కానీ ఈ విషయంలో తాజాగా ఉపేంద్రనే  క్లారిటీ ఇచ్చాడు. బాక్సర్ లో నటిస్తున్నాని అయితే అందులో అతిథి పాత్ర కాదు ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపిస్తానని వెల్లడించాడు.  ఈసినిమా కాకుండా ఉపేంద్ర హీరోగా ప్రస్తుతం కబ్జా లో నటిస్తున్నాడు. ఈ చిత్రం కన్నడ తోపాటు  తెలుగులో కూడా విడుదలకానుంది.
 
ఇదిలావుంటే  బాక్సర్ ఇటీవలే  వైజాగ్ లో కీలక షెడ్యూల్ కంప్లీట్ చేసుకోగా కరోనా వల్ల ప్రస్తుతం  షూటింగ్ కు బ్రేక్ పడింది. బాక్సింగ్ నేపథ్యంలో నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో యువ హీరో నవీన్ చంద్ర కీలక పాత్రలో కనిపించనున్నాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ  ఈచిత్రం ద్వారా నిర్మాతగా పరిచయమవుతుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే  ఈ సినిమా కు ఇంకా హీరోయిన్ ను ఖరారు చేయలేదు. ఈఏడాది  చివర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు.
 
ఇక  గత ఏడాది  ఎఫ్ 2 అలాగే  గద్దల కొండ గణేష్ తో హిట్లు కొట్టి సూపర్ ఫామ్ లోకి వచ్చాడు వరుణ్ తేజ్.  అందులో మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఎఫ్  2 అయితే వరుణ్ తేజ్ కెరీర్ లోనే బిగెస్ట్ బ్లాక్ బాస్టర్ గా  నిలిచింది. ఇక గద్దల కొండ గణేష్ కమర్షియల్ గా సక్సెస్ అవ్వడంమే కాకుండా నటుడిగా వరుణ్ కు మంచి పేరును తీసుకొచ్చింది. మరి ఇప్పుడు బాక్సర్ తో కూడా హిట్ కొట్టి వరుణ్ కెరీర్ లో మొదటి హ్యాట్రిక్  విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: