కొన్నేళ్ల క్రితం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏ
మాయ చేసావే సినిమాతో
టాలీవుడ్ కి
హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన
యువ భామ సమంత రూత్ ప్రభు, ఆ సినిమాలో జెస్సీ పాత్ర ద్వారా తన ఆకట్టుకునే అందం, అభినయంతో యువకుల హృదయాలను కొల్లగొట్టింది.
నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ఈ ప్రేమకథలో
హీరో హీరోయిన్లిద్దరి మధ్య వచ్చే
రొమాంటిక్ సీన్స్, సాంగ్స్, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నిజంగా ఎంతో హైలైట్ అనే చెప్పాలి. దర్శకుడు గౌతమ్ మీనన్ రాసుకున్న స్క్రీన్ ప్లే, ఆకట్టుకునే కథ, కథనాలు ఈ సినిమాకు మరింత బలాన్నిచ్చాయి.
ఇక ఆ
సినిమా విజయం తరువాత
టాలీవుడ్ తో పాటు అటు
కోలీవుడ్ లో కూడా వరుసగా అవకాశాలు అందుకున్న
సమంత, వాటి ద్వారా మరిన్ని విజయాలు సొంతం చేసుకుని
టాలీవుడ్ లో అనతికాలంలోనే స్టార్
హీరోయిన్ గా గొప్ప పేరు గడించారు.
మహేష్ తో కలిసి ఆమె చేసిన దూకుడు,
ఎన్టీఆర్ తో చేసిన బృందావనం, పవన్ కళ్యాణ్ తో ఆమె చేసిన
అత్తారింటికి దారేది,
అల్లు అర్జున్ తో చేసిన
సన్ ఆఫ్ సత్యమూర్తి సహా మరికొన్ని సూపర్ డూపర్ హిట్స్ ని
సమంత తన ఖాతాలో వేసుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే
సమంత ని టాలీవుడ్ గోల్డెన్ లెగ్
హీరోయిన్ అని కూడా అంటారు. ఎందుకంటే, ఆమె కెరీర్ లో చేసిన సినిమాల్లో చాలావరకు
సక్సెస్ కావడమే దానిని కారణం అని చెప్పాలి. ఇక మూడేళ్ళ క్రితం నాగచైతన్య ను వివాహం చేసుకున్న తరువాత నుండి సమంత ఒకింత సినిమాలు తగ్గించారు అని చెప్పవచ్చు.
ఒకప్పటి మాదిరిగా గ్లామర్,
రొమాంటిక్ పాత్రలు కాకుండా, ఎక్కువగా పెర్ఫార్మన్స్ కి స్కోప్ నున్న కథా సినిమాలనే ఆమె ఎంచుకుంటూ పోతున్నారు. దానితో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా కొంత ప్రాధాన్యతనిస్తున్నారు సమంత. ఇటీవల ఆమె నటించిన యు టర్న్, ఓ బేబీ సినిమాలు ఆ తరహావే. అయితే తన వద్దకు వస్తున్న దర్శకులకు ప్రత్యేకంగా షరతులు ఏమి పెట్టని
సమంత, తాను ఎంచుకునే కథల్లో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే చేయడానికి ఒకింత ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. దీనిని బట్టి అప్పటి జెస్సీకి, మొన్నటి జానుకి అదే తేడా అని అంటున్నాడు సినీ విశ్లేషకులు.....!!