ప్రస్తుతం వరుస పరాజయాలతో కెరీర్ పరంగా కొంత సతమతం అవుతున్న హీరోల్లో స్టార్ హీరో మాస్ రాజా రవితేజ కూడా ఒకరు అని చెప్పకత తప్పదు. మూడేళ్ళ క్రితం యువ దర్శకడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా తరువాత ఇప్పటివరకు రవితేజ నటించిన సినిమాలేవీ కూడా పెద్ద సక్సెస్ ని అందుకోలేదు సరికదా, అందులో దాదాపుగా అన్ని కూడా ఘోర పరాజయాలను మూటగట్టుకున్నాయి. ఇక ఇటీవల విఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్సార్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రవితేజ నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ డిస్కో రాజా కూడా ఫ్లాప్ అవడంతో రవితేజ కెరీర్ కొంత సందిగ్ధంలో పడింది. 

 

ఇక ప్రస్తుతం తనకు బలుపు సినిమాతో మంచి హిట్ ని అందించిన గోపీచంద్ మలినేని దర్సకకత్వంలో క్రాక్ సినిమాని చేస్తున్నారు రవి. బలుపులో ఆయన తో కలిసి జోడి కట్టిన శృతి హాసన్, ఈ సినిమాతో మరొక్కసారి రవితేజ ప్రక్కన నటిస్తోంది. సముద్ర ఖని, వరలక్ష్మి శరత్ కుమార్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాని మే లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించినప్పటికీ, ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ విధించడం వలన మిగతా సినిమాలతో పాటు ఈ క్రాక్ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. ఇక ఈ సినిమా తరువాత తనతో కలిసి గతంలో వీర సినిమాని తీసిన రమేష్ వర్మతో మరొక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రవితేజ. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఆ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. 

 

ఇక దాని తరువాత నేను లోకల్, హలో గురు ప్రేమకోసమే సినిమాల దర్శకుడు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ ఒక సినిమా చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. ఇటీవల లాక్ డౌన్ కి కొద్దిరోజుల ముందు త్రినాథ రావు చెప్పిన కథ ఎంతో నచ్చిన రవితేజ, రమేష్ వర్మ సినిమా అనంతరం చేస్తానని మాటిచ్చారట. మొత్తంగా గోపీచంద్, రమేష్ వర్మ, త్రినాధరావు ఈ ముగ్గురు తీసే సినిమాల మీదనే కొంత వరకు రవితేజ కెరీర్ గ్రాఫ్ ఆధారపడి ఉంది. మరి వారు ఆయనకు ఏ రేంజ్ సినిమాలు ఇస్తారో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు ఓపికపట్టాల్సిందే....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: