యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అరవింద సమేత 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చి అప్పట్లో సూపర్ హిట్ కొట్టింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మించగా తమన్ సంగీతాన్ని అందించడం జరిగింది. ఇక ప్రస్తుతం రాజమౌళి తీస్తున్న రౌద్రం రణం రుధిరం సినిమాలో కొమరం భీమ్ గా నటిస్తున్న ఎన్టీఆర్, దాని అనంతరం మరొకమారు త్రివిక్రమ్ తో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. 

 

ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ కలిసి సంయుక్తంగా ఎంతో భారీ లెవెల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కనున్నట్లు టాక్. ఇక ఈ సినిమాకి అయినను పోయి రావలె హస్తినకు అనే టైటిల్ పరిశీలిస్తున్నారని, అలానే ఎన్టీఆర్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి నేడు ఒక న్యూస్ పలు టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే ఇందులో ఇద్దరు కాదు, మొత్తం ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారని సమాచారం. కాగా వీరిలో ఇద్దరు మెయిన్ హీరోయిన్స్ అని, అలానే మరొక హీరోయిన్ పాత్ర సినిమాకి ఎంతో కీలకమైందని అంటున్నారు. 

 

మొత్తంగా ఈ మూడు పాత్రల్లో శృతిహాసన్, జాన్వీ కపూర్, కియారా అద్వానీ లేదా కీర్తి సురేష్ నటించే అవకాశాలు చాలావరకు ఉన్నట్లు చెబుతున్నారు. స్క్రిప్ట్ పరంగా ఎంతో పవర్ఫుల్ గా పలు కమర్షియల్ హంగులతో ఈ కథని సిద్ధం చేసే పనిలో ఉన్నారట త్రివిక్రమ్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న వార్త ప్రకారం ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారా లేరా అనేది తెలియాలి అంటే, సినిమా నిర్మాతల నుండి అధికారిక ప్రకటన రావాల్సిందే అని అంటున్నారు సినీ విశ్లేషకులు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: