ఇప్పటికే భరత్ అను నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వంటి మూడు వరుస విజయాలతో హ్యాట్రిక్ కొట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు, అతి త్వరలో నెక్స్ట్ మూవీ ని ఎనౌన్స్ చేయనున్నారు. యువ దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాని మహేష్ బాబు, కొరటాల శివ కలిసి సంయుక్తంగా నిర్మించనున్నట్లు టాక్. వాస్తవానికి ఈ సినిమా ప్లేస్ లో మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి తో మహేష్ బాబు సినిమా చేయాల్సి ఉంది, అయితే ఆ సినిమా పూర్తి స్క్రిప్టు సిద్ధం కాకపోవడంతో వంశీ ప్లేస్ లోకి పరశురామ్ రావడం జరిగింది. 

 

అయితే పరశురాం సినిమా అనంతరం వంశీ పైడిపల్లి సినిమా ఉండనున్నట్లు సమాచారం. కాగా ఆ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా వార్త ప్రస్తుతం ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే వంశీ పైడిపల్లి తో మహేష్ చేయబోయే సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అలానే మహేష్ బాబు ఒక పవర్ఫుల్ డాన్ పాత్రలో కూడా కనిపిస్తారు అని కూడా ప్రచారం జరిగింది. కాగా ఆ వార్త నిజమే అని, ఈ సినిమాలో మహేష్ బాబు 'అర్జున్ రాయ్' అనే పవర్ఫుల్ డాన్ పాత్రలో కనిపించనున్నారని, ఒకరకంగా కొన్నేళ్ల క్రితం సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన బాషా సినిమా లోని పాత్ర వలె అర్జున్ రాయ్ క్యారెక్టర్ కూడా వంశీ పైడిపల్లి డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. 

 

మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో పాటు పలు కమర్షియల్ హంగులు కూడా జోడించి దర్శకుడు వంశీ ఈ కథని సిద్ధం చేస్తున్నాడట. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు అటు క్లాస్ గా అలానే ఇటు మాస్ గా రెండు రకాల విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారట. మరి ప్రస్తుతం విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంత వరకు ఉన్నాయో తెలియదుగానీ, ఇదే కనుక నిజమైతే సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ కు ఇది అతి పెద్ద పండుగ వార్త అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: