బాలీవుడ్ భామ నిధి అగర్వాల్ ఎట్టకేలకు తెలుగులో మొదటి హిట్ అందుకుంది. అక్కినేని అన్నదమ్ములతో నడిచిన ఈ అమ్మడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ డైరక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. పూరి సినిమాలో హీరోయిన్స్ ను ఎలా వాడేస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిధికి ఇస్మార్ట్ హిట్ మంచి బూస్టింగ్ ఇచ్చింది. అందుకే ఆ సినిమా తర్వాత అమ్మడు వరుస ఛాన్సులు అందుకుంటుంది. 


ఇక లాక్ డౌన్ టైం లో ఇంట్లోనే ఉంటూ మొదట్లో తన ఫుడ్ తానె ప్రిపేర్ చేసుకుంటున్న పిక్స్ పెట్టి అలరించిన నిధి లేటెస్ట్ గా యాక్టింగ్ లో ఇంకాస్త ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకే ఆమె యాక్టింగ్ క్లాసెస్ వింటుందట. ఇప్పటికే ఆమె నటన మెప్పించేలా ఉన్నా అమ్మడు ఇంకా ఎక్కువ ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేయాలని చూస్తుంది. అందుకే లాక్ డౌన్ టైం లో ఆన్ లైన్ యాక్టింగ్ కోర్స్ వింటుంది. నటన మీద నిధికి ఉన్న ఇంట్రెస్ట్ చూసి ముచ్చటేస్తుంది. 


ఇక ఇస్మార్ట్ శంకర్ తర్వాత స్టార్ లీగ్ లోకి వచ్చిన అమ్మడు వరుస సినిమాలతో ఫామ్ లో ఉంది. ఒక్క హిట్టుకే ఇన్ని ఛాన్సులు వస్తే ఇక వరుసగా చేసిన సినిమాలన్నీ హిట్టు కొడితే ఆ లెక్క వేరేలా ఉంటుంది. ప్రతుతం నిధి లాక్ డౌన్ టైం లో యాక్టింగ్ పై మరింత దృష్టి పెట్టింది. సో రాబోయే సినిమాల్లో ఈ కోర్స్ తాలూఖా ఫలితం ఉంటుందన్నమాట. అమ్మడు స్పీడ్ చూస్తుంటే స్టార్ ఛాన్సులు త్వరలోనే పట్టేసేలా ఉంది. గ్లామర్ షోకి కూడా ఏమాత్రం అడ్డు చెప్పని నిధికి చూస్తుంటే తెలుగులో కెరియర్ కొన్నాళ్ళు సక్సెస్ ఫుల్ గా కొనసాగించేలా ఉంది.       

మరింత సమాచారం తెలుసుకోండి: