లాక్ డౌన్ లో అందరూ ఇంటి దగ్గరే ఉంటే .. రాజమమౌళి ఆరఆర్ ఆర్ పనుల్ని ఎలా మానిటర్ చేస్తున్నాడు...? అసలు ఎవరింట్లో వాళ్లుంటే ట్రిపుల్ సినిమా పనులు ఎలా జరుగుతున్నాయి..? షూటింగులే జరగట్లేదంటే.. సినిమా మాత్రం అనుకున్న టైమ్ కే రిలీజ్ చేస్తానంటున్నాడు . అసలు ట్రిపుల్ సినిమానే అవ్వలేదు. రిలీజ్ ఎప్పుడవుతుందో తెలీదు అనుకుంటుంటే.. అందరూ ఆశ్చర్యపోయేలా నెక్ట్స్ సినిమా మహేష్ బాబుతో అనౌన్స్ చేసేశాడు రాజమౌళి.
ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా వస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా మీద రోజుకో న్యూస్ బయటికొస్తోంది. నెక్ట్స్ జనవరికి రిలీజ్ అని రాజమౌళి అనౌన్స్ చేస్తే.. అసలుసినిమా షూట్ అయిపోతేనేకదా.. ఆన్ టైమ్ రిలీజ్ అయ్యేది.. అంటూ డౌట్స్ ఎక్స్ ప్రెస్ చేస్తున్నారు కొంతమంది. ఎవ్వరెలా అనుకున్నా..రాజమౌళి మాత్రం.. సినిమా అనుకున్న టైమ్ కే వస్తుంది అంటున్నాడు . అందుకే లాక్ డౌన్ టైమ్ లో ఫ్యాన్స్ కోసం రామ్ చరన్ వీడియో కూడ రిలీజ్ చేశాడు రాజమౌళి.
ఇప్పటి వరకూ సినిమా 75 పర్సెంట్ అయిపోయిందని, షూటింగ్ పార్ట్ కి సంబందించి ఎడిటింగ్ కూడా అయిపోయిందని క్లారిటీ ఇచ్చాడు . ఇక లాక్ డౌన్ తో షూటింగ్ ఆగిపోవడంతో ఎవరింట్లో వాళ్లు ఉండాల్సిన పరిస్తితి. అయినా సరే టెక్నాలజీని వాడుతున్నాడు రాజమౌళి. టెక్నీషియన్లతో , గ్రాఫిక్ డిజైనర్లతో , విఎఫ్ ఎక్స్ టీమ్ తో ఇంట్లోనే ఉండి పనిచేయిస్తున్నాడు.
400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి బాలీవుడ్ నటులు అజయ్ దేవ్ గన్, ఆలియా యాడెడ్ ఎట్రాక్షన్. ప్యాన్ ఇండియా సినిమాని తెలుగు వాళ్లకి పరిచయం చేసిన రాజమౌళి... నార్త్ లో ఇంకా తెలుగు స్టామినా గట్టిగా చూపించాలంటున్నాడు . అందుకే హిందీ వాళ్లకి కూడా రిలేట్ అయ్యేలా బాలీవుడ్ యాక్టర్స్ ని పెట్టాడు రాజమౌళి. ఇంతమంది స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న ట్రిపుల్ ఇంకా కొంత షూటింగ్ మాత్రమే మిగిలుందని, ఒక్కసారి షూటింగ్ స్టార్ట్ అయితే అన్నీ యాజ్ పర్ షెడ్యూల్ జరిగితే ..జనవరిలోనే సినిమా రిలీజ్ చేస్తానని చెబుతున్నాడు జక్కన్న.
2018 నుంచి న్యూస్ లో ఉన్న ఆర్ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు . రిలీజ్ ఎప్పుడన్నది ఇంకా ఫుల్ క్లారిటీ రాలేదు . కానీ తన నెక్ట్స్ సినిమాని అనౌన్స్ చేసేశాడు రాజమౌళి. ట్రిపుల్ కంప్లీట్ అవ్వగానే సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తానని సర్ ప్రైజింగ్ అనౌన్స్ మెంట్ ఇచ్చాడు రాజమౌళి. ఇప్పటివరకూ తెలుగులో అందరు స్టార్ హీరోలతో సనిమాలు చేసిన రాజమౌళి.. ఒక్క మహేష్ తోనే ఇంకా సినిమా చెయ్యలేదు . నెక్ట్స్ సూపర్ స్టార్ తో సినమా చేసి ఆ కోరిక కూడా తీర్చేసుకుందామనుకుంటున్నాడు .
అయితే వన్స్ ట్రిపుల్ ఆర్ అయిపోయాక.. మహేష్ తో సినిమా చేసేస్తానంటున్నాడు రాజమౌళి. మహేష్ కూడా సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత ఇంకా ఇప్పటివరకూ ఏ సినిమా అనౌన్స్ చెయ్యలేదు . రాజమౌళికి ఎలాగూ ఇంకో 8 నెలలు టైమ్ పడుతుంది కాబట్టి..ఈ మద్యలో పరశురామ్ తో మహేష్ సినిమా కంప్లీట్ చేస్తాడేమో చూడాలి. ఈ సినిమా చేసినా చెయ్యకపోయినా.. మహేష్ తో రాజమౌళి సినిమా ఎలా ఉంటుందో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.