'అర్జున్ రెడ్డి' సినిమాతో నేషనల్ వైడ్‌గా పాపులర్ అయ్యాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఫస్ట్ సినిమానే రస్టిక్ అండ్ బోల్డ్ కంటెంట్ తో తీసి ఓ ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు స్టార్ డమ్ ను కూడా సంపాదించుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. 'అర్జున్ రెడ్డి' సినిమానే హిందీలో షాహిద్ కపూర్ హీరోగా ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి అక్కడా సంచలనం సృష్టించాడు ఈ దర్శకుడు. ‘కబీర్ సింగ్’ భారీ బ్లాక్ బస్టర్ కొట్టడంతో ఏకంగా బాలీవుడ్ లోనే టాప్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకడిగా మారిపోయాడు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ మరో వైవిద్యమైన చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఈసారి 'అర్జున్ రెడ్డి' కాదు... అంతకు మించి ఉండేలా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట సందీప్. అయితే సందీప్ టాలీవుడ్ హీరోలతో కాకుండా ఈ సారి కూడా బాలీవుడ్ హీరోతోనే తన తరువాత సినిమాని ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది.

 

బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ తో ఓ యాక్షన్ క్రైమ్ డ్రామాను ప్లాన్ చేస్తున్నాడట. కాగా హిందీ నిర్మాతలు సందీప్ వంగ సినిమాల కోసం ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి ముందుకొస్తున్నారట. ‘కబీర్ సింగ్’ సినిమా నిర్మాత టీ-సిరీస్ భూషణ్ కుమార్, సినీ 1 స్టూడియోస్ మురాద్ ఖేతాని కలిసి సందీప్ వంగ తర్వాతి చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. వీరితోపాటే సందీప్ వంగ అన్నయ్య ‘అర్జున్ రెడ్డి’ నిర్మాత ప్రణయ్ వంగ కూడా ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకోనున్నారు. అయితే టీ సిరీస్ సంస్థతో సందీప్ చేయాల్సిన సినిమా క్యాన్సిల్ అయిందని.. దాంతో మళ్లీ సందీప్ టాలీవుడ్‌కే వచ్చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ పుకార్లే అని తెలుస్తోంది. తన తరువాత సినిమాని కూడా పాన్ ఇండియా సినిమానే ప్లాన్ చేస్తున్నాడు. మరి సందీప్ వంగ బాలీవుడ్ లో తన సక్సెస్ ను కొనసాగిస్తాడేమో చూడాలి. సందీప్‌ వంగా లాంటి క్రియేటివ్ డైరెక్టర్‌ హిందీలో మరో మంచి సినిమా చేస్తే.. ఆయన అక్కడ పెద్ద దర్శకులకు గట్టి పోటీ ఇస్తాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: