బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళి. బాహుబలి తర్వాత ఆయన చేస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ లాక్డౌన్ కారణంగా నిలివిపోయింది. అయితే రాజమౌళితో సినిమా చేయడానికి ఏ  హీరో అయినా ముందుకొస్తాడు. బాలీవుడ్ హీరోలు సైతం రాజమౌళితో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకున్న రాజమౌళితో సినిమా చేయాలని ఎవరికి ఉండదు..

 


బాలీవుడ్ హీరోలు రాజమౌళితో చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాతి సినిమా బాలీవుడ్ హీరోతోనే ఉంటుందని అనుకున్నారు. కానీ వారందరికీ షాక్ ఇస్తూ రాజమౌళి తన తర్వాతి చిత్రం మహేష్ తో ఉంటుందని చెప్పేశాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా గురించి అనేక వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిస్తే బాగుంటుందని అభిమానులు బాగా కోరుకున్నారు.

 

అయితే ఇన్ని సంవత్సరాలకి వారి కల నెరవేరింది. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ సినిమా ఉంటుందని తెలియగానే మహేష్ అభిమానులు పొంగిపోయారు. అయితే ఇక్కడే ఓ విషయం గమనించాలి. రాజమౌళి తన నెక్స్ట్ హీరో మహేష్ అని చెప్పాక, మహేష్ నుండి రాజమౌళి స్టేట్ మెంట్ పై ఏదైనా స్పందన వస్తుందేమోనని ఎదురుచూశారు. కానీ ఇన్ని రోజులు అవుతున్నా మహేష్ ఈ విషయమై అస్సలు స్పందించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

 

మహేష్ స్పందించకపోవడానికి కారణం ఏంటా అని ఆలోచిస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ చిత్రంఎవరితో ఉంటుందో ఇంకా కన్ఫర్మ్ కాలేనందున రాజమౌళి ఇచ్చిన స్టేట్ మెంట్ పై స్పందించట్లేదని అంటున్నారు. రాజమౌళితో సినిమా కన్ఫర్మ్ చేస్తే, అది ఎప్పుడు ఉంటుంది.. ఇప్పుడు ఎవరి దర్శకత్వంలో చేస్తున్నారన్న ప్రశ్నలు ఎదురవుతాయనే ఉద్దేశ్యంతోనే స్పందించడం లేదని అంటున్నారు. లాక్దౌన్ ఎత్తేసిన తర్వాత పరశురామ్ తో సినిమాపై స్పష్టత్ ఇచ్చినపుడు, రాజమౌళి సినిమా గురించి మాట్లాడతాడని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: