టాలీవుడ్ లో ఎంతోమంది లవబుల్  కపుల్  ఉన్నప్పటికీ ప్రస్తుతం అందరికీ ఫేవరెట్ కపుల్ గా ఉన్న జంట మాత్రం అక్కినేని వారి జంట అని చెప్పాలి. మొదటి సినిమామాయ చేసావే సినిమాతో ఈ జంట ప్రేక్షకులను మాయ చేసింది. తమదైన రొమాన్స్ తో అందరిని అలరించడమే కాకుండా ఈ  జంట... ఎంతోమందికి ఫేవరేట్ గా మారిపోయింది. అదేంటోగాని ఈ జంట నిజజీవితంలో కూడా ఒకటయితే బాగుండు అని ప్రేక్షకులు గట్టిగా అనుకున్నట్టున్నారు అందుకే నిజంగానే కొన్నేళ్ల పాటు ప్రేమాయణం నడిపి ఆ తర్వాత పెళ్లితో ఒక్కటయ్యారు ఈ జంట. ఇక ప్రస్తుతం జనరేషన్ కి క్యూట్ అండ్ స్వీట్ జంట ఏది అంటే నాగచైతన్య సమంత జంటగా అని చెబుతూ ఉంటారు. 

 

 

 ఏ మాయ చేసావే సినిమాతో ప్రారంభమైన వీరిద్దరి మధ్య ప్రేమాయణం ఎన్నో ఏళ్ల పాటు కొనసాగింది. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగినట్టు ఎక్కడా కనిపించకపోయినా ఆఫ్ స్క్రీన్  రొమాన్స్ మాత్రం జరుగుతూనే వచ్చింది. మరో విషయం ఏమిటంటే ఇక ఆ తర్వాత ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో అంగరంగ వైభవంగా వీరిద్దరి పెళ్లి జరిగింది. వీరిద్దరి పెళ్లి తర్వాత కూడా ఈ జంట ప్రేక్షకులను మరింతగా ఆకర్షించేంచింది  అనే చెప్పాలి. ఇదిలా ఉంటే నాగచైతన్య సమంత మధ్య లవ్ గురించి నాగార్జునసినిమా ఈవెంట్ లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మొదట వీరిద్దరి మధ్య నడుస్తున్న ప్రేమాయణం గురించి నాగార్జునకు  తెలియదట. 

 

 

 ఇంతకీ సమంత నాగచైతన్య లవ్ గురించి నాగచైతన్యకు ఎప్పుడు డౌట్ వచ్చింది అంటే.... ఓ రోజు సమంత నాగార్జున వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు... నాగార్జున పెంపుడు కుక్క ముందుగానే సమంతాను గుర్తుపట్టి సమంత వద్దకు పరుగులు తీసిందట. అదేంటి మా ఇంట్లో కుక్క కి సమంత ఎలా తెలుసు అని నాగార్జున అప్పుడు  ఆలోచించాలట. ఇక ఆ తర్వాత కాలంలో తన కొడుకు నాగచైతన్య సమంత లవ్ లో ఉన్నారని అర్థం అయిందట. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున సినిమా ఇంట్లో చెప్పుకొచ్చారు. ఇక పెళ్లి తర్వాత ఈ జంట  కెరియర్ మరింత సక్సెస్ ఫుల్ గా దూసుకు పోతుంది అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: