ఈ మధ్య కాలంలో తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఎన్నో సూపర్ హిట్లు సాధించాయి. తెలుగులో వచ్చిన చాలా సినిమాలు వేరే భాషల్లోకి రీమేక్ వెళ్తున్నాయి. గతంలో తెలుగు సినిమాలు రొటీన్ కథలతో నిండిపోయేవి. కానీ ఇప్పుడా పరిస్థితి మారింది. తెలుగులో వస్తున్న కంటెంట్ సినిమాలు మామూలుగా ఉండట్లేదు. మన సినిమాలకి వేరే భాషల్లో సైతం మార్కెట్ పెరుగుతుందంటే తెలుగు సినిమా ఎంతలా మారిందో అర్థం చేసుకోవచ్చు.

 


అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన తెలుగు సినిమాల్లో చిన్న సినిమాగా విడుదలై సెన్సేషనల్ హిట్ సాధించిన చిత్రం అర్జున్ రెడ్డిగా చెప్పుకోవచ్చు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో సంచలన విజయం సాధించింది. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా విజయ్ ని స్టార్ ని చేసింది. అయితే ఈ సినిమా తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి బాలీవుడ్ లో అర్జున్ రెడ్డిని కబీర్ సింగ్ గా రీమేక్ చేసి బాక్సాఫీసుని కొల్లగొట్టాడు.

 

తెలుగులో అర్జున్ రెడ్డి ఎంతటి విజయం సాధించిందో బాలీవుడ్ లోనూ అంతటి విజయాని అందుకుంది కబీర్ సింగ్ సినిమా. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రం ఆయన కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. దాంతో బాలీవుడ్ నిర్మాతలు సందీప్ తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు. బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ తో సినిమా ఉంటుందని వార్తలు వచ్చినా, అది నిజం కాదని తేలిపోయింది.

 

అయితే త్వరలో సందీప్ సినిమా స్టార్ట్ అవనుందట. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా ఈ చిత్రం ఉండనుందని చెబుతున్నారు. తెలుగులో మహేష్ తో సినిమా ఉంటుందని వార్తలు వచ్చినప్పటికీ, పరశురామ్ దర్శకత్వంలో మహేష్ చేస్తున్నాడని తేలడంతో అవి కూడ ఒట్టి మాటలేనని అర్థం అయింది. అయితే రణ్వీర్ సింగ్ తో సందీప్ సినిమా అని వస్తున్న వార్తలపై లాక్డౌన్ తర్వాతే క్లారిటీ రానుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: