ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్స్ లిస్ట్ లో శ్రేయ అగ్రస్థానంలో ఉండేది. అగ్రహీరోల సరసన అందరితో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. ఇక గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు చాలా దూరంగా ఉంది అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ బ్యూటీ భర్తతో కలిసి స్పెయిన్ దేశంలో జీవనం కొనసాగిస్తున్నారు. ఇటీవల తన భర్తకు కరోనా వైరస్ లక్షణాలు ఉండడంతో డాక్టర్లను సంప్రదించారు. ఇక కోవిడ్ టెస్టు అనంతరం నెగిటివ్ రావడంతో.. డాక్టర్లు ఇంట్లోనే క్వారంటైన్ లో ఉండమని సలహా ఇవ్వడం జరిగింది. దీంతో వారిద్దరు కూడా ఇంటికే పరిమితమయ్యారు అని చెప్పాలి. 

 


ఇక కరోనా వైరస్ కారణంగా నటీనటులను అందరూ కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఒకరికి ఒకరు చాలెంజ్ విసురుతూ అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు.. ఇంట్లో ఉండే వారి సతీమణుల కుటుంబ సభ్యులకు బాగా సహాయం చేసినారు అని చెప్పాలి. ఇక ఈ తరుణంలో శ్రేయ, ఆండ్రీ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఇంట్లో ఉంటూ రోజుకొక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం మాత్రం శ్రేయ ఆన్లైన్ క్లాసులు వింటూ.. యోగా చేస్తున్న వీడియో షేర్ చేయడం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. 

 

ఇక సాధారణంగా శ్రీయ ఆరోగ్యం ఫిట్ నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంటుంది. అంతేకాకుండా వర్క్ ఔట్స్ యోగ కి చాలా సమయం కేటాయిస్తుంది అనే చెప్పాలి. అందుకు తన అందానికి సీక్రెట్ కూడా ఇదే అంటుంది శ్రీయ. ఇక ఎందుకు ఆలస్యం మీరు కూడా చుడండి ఆ వీడియోని.

 

ఇక ఈ లాక్ డౌన్ సమయంలో ఇంటిపట్టునే ఉంటూ యోగా ట్రైనర్ సహాయం తో.. బ్యూటీ యోగా చేయడం అందరినీ ఆకర్షిస్తుంది. ఇక శ్రేయ చేసిన యోగ వీడియో మీకోసం...

 

మరింత సమాచారం తెలుసుకోండి: