యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నాడు. బాహుబలి తర్వాత వచ్చిన సాహి సినిమా ప్రభాస్ రేంజ్ ఏంటో చూపించింది. ఆ సినిమా తెలుగులో ఆడలేదు కానీ హిందీలో మాత్రం మంచి వసూళ్లు రాబట్టింది. ఇక ప్రస్తుతం జిల్ ఫేమ్ krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ డైరక్షన్ లో ఓ డియర్ (ప్రచారంలో ఉన్న టైటిల్) చేస్తున్నాడు. ఆ సినిమా సగానికి పైగా షూటింగ్ జరుపుకుంటుంది. బుట్టబొమ్మ పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. 

 

సినిమా తర్వా ప్రభాస్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో నటిస్తుందని తెలుస్తుంది. వరుస స్టార్ సినిమాలతో క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ ప్రభాస్ కోసం కె.జి.ఎఫ్ డైరక్టర్ ని తీసుకొస్తున్నారట. కన్నడలో యష్ హీరోగా వచ్చిన కెజిఎఫ్ సినిమాతో సంచలన విజయం అందుకున్నాడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం కెజిఎఫ్-2 తెరకెక్కిస్తున్నాడు. కన్నడ స్టార్ డైరక్టర్ తెలుగులో స్టార్ హీరోని డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ లాక్ డౌన్ పూర్తయ్యాక ఈ సినిమా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ చేస్తారట. ఇప్పటికే ప్రభాస్ కు లైన్ వినిపించాడట ప్రశాంత్ నీల్. 

 

కన్నడ డైరక్టర్ ని రంగంలో దించుతున్నారు అంటే.. ఈ సినిమా కూడా పాన్ ఇండియా సినిమాగా తీసుకురావడం పక్కా అని చెప్పొచ్చు. ఇప్పటికే తెలుగులో అల్లు అర్జున్, సుకుమార్ పుష్ప, పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ ఫైటర్ సినిమాలు ఐదు భాషల్లో రిలీజ్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు ప్రభాస్ సినిమా కూడా వస్తే హిందీ బాక్సాఫీస్ పై తెలుగు సినిమా సత్తా ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సాహో టార్గెట్ మిస్ అవగా ఓ డియర్ పక్కా హిట్ అనే అంటున్నారు. ఇక ప్రశాంత్ నీల్ సినిమాతో మరోసారి రికార్డులు సృష్టించడం ఖాయమని ఫిక్స్ అవుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: