బాబాయ్, అబ్బాయ్ బాలకృష్ణ, ఎన్టీఆర్ మధ్య లుకలుకలు సమసిపోలేదా.. మనస్పర్థలు కొనసాగుతూనే ఉన్నాయా.. అబ్బాయ్ విసిరిన ది ద రియల్ మేన్ ఛాలెంజ్ ను బాలకృష్ణ ఎందుకు స్వీకరించలేదు. ఛాలెంజ్ చేసిన వారం రోజులు పూర్తికావడంతో.. అబ్బాయ్ నామినేషన్ ను బాబాయ్ లైట్ గా తీసుకున్నాడా.. 

 

కరోనా సమయంలో ఇంట్లో ఆడవాళ్లకు సహాయంగా ఉంటూ.. ఇంటి పనులు చేసేలా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా బి ద రియల్ మేన్ పేరుతో రాజమౌళికి ఛాలెంజ్ విసిరాడు. రాజమౌళి ఛాలెంజ్ పూర్తి చేసి.. ఎన్టీఆర్, రామ్ చరణ్.. సుకుమార్ ను నామినేట్ చేయగా.. అందరూ టాస్క్ పూర్తి చేశారు. ఎన్టీఆర్ తెలుగు ఇండస్ట్రీ సీనియర్ హీరోలందరినీ నామినేట్ చేశాడు. చిరంజీవి.. వెంకటేశ్ ఇంటిపనులు చేసి బి ద రియల్ మేన్ అనిపించుకున్నారు. 

 

ఎన్టీఆర్ నలుగురిని నామినేట్ చేస్తే.. చిరంజీవి, వెంకటేశ్ మాత్రమే ఛాలెంజ్ స్వీకరించి టాస్క్ పూర్తి చేశారు. బాలకృష్ణ, నాగార్జున మాత్రం ఇంటి పనులకు దూరంగా ఉంటున్నారు. బాబాయ్.. అబ్బాయ్ ఛాలెంజ్ ను స్వీకరిస్తాడా.. లేదా అనే టాపిక్ గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఒకవేళ టాస్క్ పూర్తి చేస్తే.. బాబాయ్ అబ్బాయ్ ల మధ్య రిలేషన్ షిప్ బాగుందనీ.. పూర్తిచేయకపోతే.. ఇద్దరి మధ్య బంధం అంతంతమాత్రమేనని కామెంట్స్ వినిపించాయి. వారం గడిచినా.. బాలయ్య నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. 

 

బాబాయ్ సంగతి పక్కనపెడితే.. ఎన్టీఆర్ మరో బాబాయ్ నాగార్జున నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. చిరంజీవి, వెంకటేశ్ పని పూర్తి చేయకపోవడంతో.. తారక్ విసిరిన బి ద రియల్ మేన్ ఛాలెంజ్ 50 పర్సెంట్ మాత్రమే సక్సెస్ అయింది. బాబాయ్ లు బాలకృష్ణ, నాగార్జున కూడా టాస్క్ పూర్తి చేస్తే గానీ.. తారక్ విసిరిన బిద రియల్ మేన్ ఛాలెంజ్ సంపూర్ణం కాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: