దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా గత నెల నుంచి లాక్ డౌన్ ప్రకటించింది ప్రభుత్వం. అంతకు ముందే షాపింగ్ మాల్స్, థియేటర్లు, క్లబ్స్, విద్యా వ్యవస్థలు అన్నీ క్లోజ్ చేయించారు. లాక్ డౌన్ వచ్చే నెల 3 వరకు పొడిగించారు. అయితే తెలంగాణ లో మే 7 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ సందర్భంగా సినీ సెలబ్రెటీలు అందరూ తమ ఇళ్లలోనే ఉండిపోయారు. రు. కొందరు పుస్తకాలు చదువుతూ టైం పాస్ చేస్తుంటే మరి కొందరు వెరైటీ వంటకాలు చేస్తూ నోరూరిస్తున్నారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతున్నారు. కొంత మంది తమ వంతు విరాళాలు ఇస్తూ.. పేద ప్రజలను ఆదుకుంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి సీసీసీ స్థాపించగా ఎంతో మంది సినీ నటులు తమ విరాళాలు ఇస్తున్నారు.. దాంతో పేద సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులు.. డబ్బులు అందజేస్తున్నారు. ఇక ఇంట్లో ఉంటున్న దర్శక, నిర్మాత, హీరోలు ఛాలెంజ్ విసురుకుంటున్నారు. తాజాగా డైలాగ్ కింగ్ మోహన్ బాబు ప్రముఖ నిర్మాత... రాజకీయ నేత టి. సుబ్బిరామిరెడ్డి కూతురు పింకీ తనకు ‘వంట సవాల్’ విసిరిందని చెబుతూ తాను స్వయంగా శనిగపప్పు మసాలా వడలు చేస్తున్న తాలూకు వీడియో షేర్ చేశారు.
మంచు లక్ష్మీ కూతురు మనవరాలు విద్యా నిర్వాణ తో కలిసి మంచు మోహన్ బాబు వడలు చేయడం అయిపోయాక.. నేను టేస్ట్ చేయాలా? నువ్వు టేస్ట్ చేస్తావా? అని అడిగిన మోహన్ బాబు.. చివరకు ఆయనే నోట్లో వేసుకొని ఆహా ఏమి రుచి అన్నారు. కాగా, టాలీవుడ్లో విస్తృతంగా మారిన బీ ది రియల్ మెన్ చాలెంజ్లో భాగంగా చిరంజీవి, వెంకటేష్, సుకుమార్ ఇలా పలువురు సెలబ్రిటీలు కిచెన్లో వెరైటీ స్పెషల్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.