సుకుమార్ - అల్లు అర్జున్ - దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం పుష్ప. కన్నడ బ్యూటి రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. శేషాచలం అడవుల్లో గంధపుచెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఎక్కువ భాగం తెరకెక్కనుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి టైటిల్ పోస్టర్ అండ్ అల్లు అర్జున్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాదు అయిదు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుంది. 

 

లాక్ డౌన్ లేకపోతే గనక ఈపాటికే పుష్ప సినిమా షెడ్యూల్ శరవేగంగా జరుగుతుండేది. కానీ అనూహ్యంగా నెలకొన్న లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతానికి బ్రేక్ ఇచ్చారు.  అయితే దర్శకుడు సుకుమార్ మాత్రం దేవిశ్రీప్రసాద్ తో కలిసి ఆన్ లైన్ లో మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు పెట్టారని తెలుస్తుంది. ఇప్పటికే పుష్ప సినిమాకు దేవిశ్రీ 3 ట్యూన్స్ ఇచ్చానని.. అటు బన్నీ, ఇటు సుకుమార్ ఇద్దరికీ ఆ ట్యూన్స్ నచ్చాయని తెలిపాడు. దేవిశ్రీ-సుక్కూ-బన్నీ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో పుష్పపై భారీ అంచనాలున్నాయి. 

 

ఇక అల వైకుంఠపురములో సినిమాతో తమన్, బన్నీకి పెద్ద మ్యూజికల్ హిట్ ఇచ్చాడు. దాంతో అంతకంటే బెస్ట్ ఆల్బం ఇవ్వాలన్న కసితో ఇప్పుడు  దేవిశ్రీ చాలా కసిగా ఉన్నాడట. ఇక పుష్ప సినిమా స్టోరీ అద్భుతంగా ఉందని సుకుమార్ కెరీర్ బెస్ట్ సినిమాగా పుష్ప నిలిచిపోతుందని దేవిశ్రీ తన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఆర్య, ఆర్య-2, రంగస్థలం సినిమాల మాదిరిగానే పుష్ప సినిమాలో కూడా ఒక అదిరిపోయో ఐటెంసాంగ్ ఉంటుందని క్లారిటి ఇచ్చాడు. అంతే కాదు ఆ సాంగ్ ఇప్పటి వరకు వచ్చిన అల్లు అర్జున్ సినిమాలకంటే ది బెస్ట్ గా ఉంటుందని అంటున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: