ఉయ్యాలా జంపాలాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్, అవికా గోర్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టారు. ఈ సినిమా తరువాత కొంత గ్యాప్ ఇచ్చి సినిమా చూపిస్త మావ లో నటించింది ఈజోడి. ఈచిత్రం కూడా హిట్ అనిపించుకుంది. ఇక ఈ సూపర్ హిట్ పెయిర్ మూడో సారి కలిసి నటించేందుకు సిద్దమవుతుంది. శ్రీనివాస్ గవిరెడ్డి డైరెక్షన్ లో రాజ్ తరుణ్ తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడు. ఈ చిత్రంలో అవికా గోర్ హీరోయిన్ గా నటించనుందట. త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి. శ్రీనివాస్ తో ఇంతకుముందు రాజ్ తరుణ్, సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు అనే సినిమా చేశాడు. ఈచిత్రం పరాజయాన్నిచవిచూసింది.
ఇదిలావుంటే గత కొంత కాలంనుండి వరుస పరాజయాలతో సతమతమవుతున్న
రాజ్ తరుణ్.. ఇటీవల 'ఇద్దరి లోకం ఒకటే' తో
రాగ ఈసినిమా కూడా దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్రముఖ
నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించగా కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా రాబట్టలేకపోయింది.
కృష్ణా తెరక్కించిన ఈ చిత్రంలో అర్జున్
రెడ్డి ఫేమ్
షాలిని పాండే హీరోయిన్ గా నటించగా
మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు
ఇక రాజ్ తరుణ్ ప్రస్తుతం గుండె జారి గల్లంతయ్యిందే ఫేమ్ విజయ్ కుమార్ కొండా డైరెక్షన్ లో ఒరేయ్ బుజ్జిగా అనే చిత్రంలో నటిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా మాళవిక నాయర్ కథానాయికగా నటిస్తుంది. ఈపాటికే ఈ చిత్రం విడుదలకావాల్సి ఉండగా కరోనా వల్ల వాయిదాపడింది. శ్రీ సత్య సాయిబాబా ఆర్ట్స్ పతాకం పై కేకే రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మరి ఈ సినిమాతోనైనా రాజ్ తరుణ్ హిట్ కొడతాడో లేదో చూడాలి.