మోడల్ గా కెరియర్ ప్రారంభించి హీరోయిన్ గా బాలీవుడ్ లో సక్సెస్ అయిన భామ కృతి సనన్. మోడల్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు సూపర్ స్టార్ మహేష్ 1 నేనొక్కడే సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ సినిమా తర్వాత నాగ చైతన్యతో దోచేయ్ సినిమా చేసింది కృతి. సినిమాల్లోకి వెళ్తున్నా అని తెలియగానే తనని అందరు ఆలోచన మానుకోవాలని మందలించారని... బంధువులు కొందరైతే సినీ పరిశ్రమ ఒక బురదగుంట అందులోకి వెళ్తే నీకు పెళ్లి అవడం కూడా కష్టమని అన్నారు. అయితే అప్పుడు వారి మాటలు విని ఆగిపోతే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు అంటుంది కృతి సనన్. 

 

తెలుగులో రెండు సినిమాలతోనే ఆగిపోయిన అమ్మడు బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలు చేస్తుంది. హీరో పంటి, బరేలీ కి బర్ఫీ, లూకా చుప్పీ, హౌజ్ ఫుల్ 4 సినిమాలతో వరుస హిట్లు అందుకుంది కృతి సనన్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లో రాణించడం కష్టం. కానీ ప్రయత్నిస్తే కసిరితంగా అది జరిగి తీరుతుంది అని గట్టిగా చెబుతుంది కృతి సనన్. తనని ఆరోజు చిన్న చూపు చూసిన వారే ఇప్పుడు తన గురించి గొప్పగా మాట్లాడుతున్నారని.. సినీ పరిశ్రమ బయటనుండి ఒకలా ఉంటుంది కానీ ఇందులోకి వస్తే అసలు విషయం తెలుస్తుందని అన్నారు కృతి సనన్. 

 

హిందీలో వరుస సినిమాలతో బీభత్సమైన ఫామ్ లో ఉన్న ఈ అమ్మడు తెలుగులో ఇప్పుడప్పుడే కనిపించే ఛాన్స్ లేవనే చెప్పాలి. మహేష్ తో నటించిన 1 నేనొక్కడినే హిట్టయితే పరిస్థితి ఎలా ఉండేదో కానీ ప్రస్తుతం కృతి సనన్ బాలీవుడ్ మీదే పూర్తిగా దృష్టి పెట్టింది. అక్కడ చేస్తున్న సినిమాలు కూడా మంచి విజయాలు సాధిస్తున్నాయి కాబట్టి అమ్మడి కెరియర్ కు ఢోకా లేదని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: