ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చిరంజీవి చేస్తున్న హడావిడి మెగా అభిమానులకు మాత్రమే కాకుండా ఇండస్ట్రీకి కూడ షాక్ అవుతోంది. అలాంటి మెగా స్టార్ ఛాలెంజ్ ని ఇప్పుడు ఆ ముగ్గురు కేర్ చేయకపోవడంతో తమ మెగా స్టార్ కు వారు ఇచ్చే విలువ ఇదేనా అంటూ అభిమానులు చిన్నబుచ్చుకుంటున్నారు. లాక్ డౌన్ తో ఇంటికి పరిమితం అయిపోయిన సెలెబ్రెటీలు రకరకాల ఛాలెంజ్ లు విసురుతూ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం జనానికి చూడడానికి సినిమాలు కూడ లేకపోవడంతో టాప్ సెలెబ్రెటీలు ఒకరికొకరు విసురుకుంటున్న ఛాలెంజ్ లను ఎంజాయ్ చేస్తున్నారు. 

 

కొన్ని రోజులక్రితం చిరంజీవి ‘బీ ది రియల్ మేన్’ అంటూ దోసెలు వేసి తన తల్లికి తినిపించడమే కాకుండా ఈ ఛాలెంజ్ ను కొనసాగించ వలసిందిగా ముగ్గురుని నామినేట్ చేసాడు. ఈ లిస్టులో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ టాప్ డైరెక్టర్ మణిరత్నం మంత్రి కేటిఆర్ లు ఈ ఛాలెంజ్ లో ఉన్నారు. చిరంజీవి ఈ ఛాలెంజ్ విసిరి రోజులు గడుస్తున్నా ఈ ముగ్గురిలో ఎవరు స్పందించక పోవడంతో మెగా స్టార్ ను ఈ ముగ్గురూ లైట్ గా తీసుకున్నారా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.  

 

వాస్తవానికి చిరంజీవి రజినీకాంత్ లు మంచి స్నేహితులు. అయితే గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య బయటపడని ఎదో గ్యాప్ ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. దీనికితోడు గత సంవత్సరం చెన్నైలో జరిగిన ‘సైరా’ ప్రమోషన్ ఈవెంట్ కు అతిధిగా రమ్మని ఆహ్వానించినా రజినీకాంత్ స్పందిచలేదు అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. 

 

ఇక మణిరత్నం విషయానికి వస్తే అతడి భార్య సుహాసిని చిరంజీవి మంచి స్నేహితులు. కొంత కాలం క్రితం మణిరత్నం స్వయంగా చిరంజీవి ఇంటికి వచ్చి చరణ్ తో ఒక సినిమా తీయాలని ప్రయత్నిస్తే అప్పట్లో చరణ్ పెద్దగా స్పందించలేదు అన్న వార్తలు కూడ ఉన్నాయి. ఈ విషయాలు మనసులో పెట్టుకుని బహుశా చిరంజీవి సవాల్ కు రజినీకాంత్ మణిరత్నం లు స్పందించి ఉండరు అన్న ప్రచారం జరుగుతోంది. ఇక మంత్రి కెటీఆర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో కరోనాను కట్టడి చేసే కార్యక్రమాల బిజీలో ఉండటంతో ఆయన కూడ చిరంజీవి సవాల్ ను పట్టించుకుని ఉండక పోవచ్చు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా ముగ్గురు ప్రముఖులు రకరకాల కారణాలతో చిరంజీవి సవాల్ ను పట్టించుకోకపోవడం చాల మందిని ఆశ్చర్య పరుస్తోంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: