‘సరిలేరు నీకెవ్వరూ’ మూవీతో ఈ సంక్రాంతికి బ్లాక్‌బాస్టర్ హిట్ కొట్టి 'బ్లాక్ బస్టర్ కా బాప్' అనిపించుకున్నాడు సూపర్ స్టార్ మహేష్. ఇదే ఊపులో తన నెక్స్ట్ సినిమా పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు మహేష్. తన కెరీర్లో 27వ చిత్రంగా తెరకెక్కబోతున్న సినిమాకి 'గీతగోవిందం' ఫేమ్ పరశురామ్ దర్శకత్వం చేయబోతున్నట్లు సమాచారం.  ఈ విషయం అధికారికంగా ప్రకటించకపోయినా లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్న మహేష్ నెక్స్ట్ కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా కొంత డిఫరెంట్ గా ఉండేలా కొత్త తరహా కథలను ఎంచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతుందట.

 

కాగా ఈ చిత్రంలో స్క్రిప్ట్ ప్రకారం చాలా భాగం యుఎస్ బ్యాక్‌ డ్రాప్ లో సాగాల్సి ఉందట. దాంతో కచ్చితంగా ఈ చిత్రంలో ఎక్కువ భాగం అమెరికాలో షూట్‌ చేయాల్సిన పరిస్థితి ఉందట. కానీ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అమెరికాలో షూట్ చేయడం కష్టం. దాంతో స్క్రిప్ట్ నే మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేశారట పరశురామ్. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ హీరోయిన్స్ కియారా అద్వానీ లేదా సారా అలీఖాన్, లేదా మన మహానటి కీర్తి సురేష్ మహేష్ తో రొమాన్స్ చేసే అవకాశాలున్నాయని సమాచారం. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన మే 31న మహేష్ బాబు తండ్రి కృష్ణ బర్త్ డే సందర్భంగా వెల్లడిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో విలన్ గా కన్నడ హీరో ఉపేంద్ర అయితే బాగుంటుందని చిత్రబృందం భావిస్తోంది. మరి కన్నడ నాట స్టార్ హీరోగా కొనసాగుతున్న ఉపేంద్ర, మహేష్ సినిమాలో విలన్ గా చేయడానికి అంగీకరిస్తాడా లేదా అనేది చూడాలి. ఇక ఈ మూవీని 14 రీల్స్ ఎనెర్టైన్మెంట్స్ మైత్రి మూవీ మేకర్స్ మరియు జిఎంబి ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. లాక్ డౌన్ ముగిసిన అనంతరం పరశురామ్ - మహేష్ కొత్త సినిమాను జెడ్ స్పీడ్ వేగంతో కంప్లీట్ చేయనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: