పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇద్దరు కలిసి చేస్తే ఆ సినిమా సూపర్ హిట్ అన్నట్టే లెక్క. జల్సా నుండి అజ్ఞాతవాసి వరకు మూడు సినిమాలు ఈ ఇద్దరు కలిసి చేయగా మూడింటిలో ఒకటి మాత్రమే అంచనాలను అందుకోలేదు. ప్లాపుల్లో ఉన్న పవన్ కళ్యాణ్ ను జల్సాతో హిట్ ట్రాక్ ఎక్కించాడు త్రివిక్రమ్. అసలైతే జల్సా కన్నా ముందు అతడు సినిమాను పవన్ తో చేయాలని అనుకున్నాడు త్రివిక్రమ్.. కానీ అది కుదరలేదు. ఆ సినిమా కథ వింటూ పడుకున్నాడట పవన్ కళ్యాణ్.

 

ఇక కొద్దిపాటి గ్యాప్ తర్వాత జల్సాతో వీళ్ళు కలిసి పనిచేశారు. ఇక ఆ తర్వాత అత్తారింటికి దారేది సినిమాతో సంచలన విజయం అందుకున్నారు. ఆ సినిమా రిలీజ్ ముందు ఫస్ట్ హాఫ్ మొత్తం ఎడిటింగ్ రూమ్ నుండి లీక్ అయినా సెకండ్ హాఫ్ లో అసలు సినిమా ఉండటం వల్ల సినిమా కలక్షన్స్ మీద ఎఫెక్ట్ పడలేదు. అంతేకాదు ఆ లీక్ అయినా ఫస్ట్ హాఫ్ ను చూసి సెకండ్ హాఫ్ చూడాలని థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులు ఉన్నారు. లీకైన సినిమాతో రికార్డులు కొట్టడం కూడా పవన్, త్రివిక్రమ్ లకే చెల్లిందని చెప్పొచ్చు. 


ఇక అజ్ఞాతవాసి సినిమాతో మరోసారి త్రివిక్రం, పవన్ కలిసి పనిచేశారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేదు. హాలీవుడ్ సినిమా కథను కాపీ కొట్టి ఈ సినిమా తీశాడని త్రివికం మీద చాలా విమర్శలు వచ్చాయి. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ తో అరవింద సమెత, అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో సినిమాలతో తన సత్తా చాటాడు త్రివిక్రం. తన తర్వాత సినిమామ ఎన్టీఆర్ తో చేస్తాడని తెలుస్తుంది. మళ్ళీ పవన్ తో సినిమా చేస్తే ఈసారి రికార్డులు కొట్టే సినిమా చేయాలని పర్ఫెక్ట్ ప్లాన్ తో ఉన్నాడట త్రివిక్రమ్.

మరింత సమాచారం తెలుసుకోండి: