బాలీవుడ్‌ లో ఆన్‌ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్‌ కూడా బెస్ అనిపించుకున్న జోడి దీపికా పదుకొని, రణబీర్ కపూర్‌. ఈ జంట తెర మీదే కాదు తెర వెనుక కూడా రొమాంటిక్ రిలేషన్‌ షిప్ మెయిన్ టైన్‌  చేశారు. అయితే తరువాత వీరిద్దరు మనస్పర్దలతో విడిపోయారు. ఒక దశలో రణబీర్‌ నన్ను మోసం చేశాడు అంటూ ప్రత్యక్షంగా ఆరోపణలు చేసింది దీపికా. దీంతో ఈ హాట్ జోడి తెర మీద కలిసి కనిపించటం మానేశారు.

 

కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. గత అనుభవాలను పక్కన పెట్టి ఈ జంట తిరిగి కలిసి నటించేందుకు ఓకె చెప్పారు. ప్రస్తుతం ఇద్దరు ఆరోగ్య కరనమైన స్నేహ భావంతో ఉన్నారు. దీంతో అభిమానులు మరోసారి ఈ జోడిని తెర మీద చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అభిమానుల కోరిక మేరకు రణబీర్‌, దీపిక లు కూడా త్వరలో కలిసి నటించేందుకు రెడీ అవుతున్నారు.

 

ఈ ఐకానిక్ కపుల్‌ ను తిరిగి తెర మీదకు తీసుకువచ్చే బాధ్యతలను బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ బసు తీసుకున్నాడు. ఇప్పటికే అనురాగ్ బసు దీపికతో పాటు రణబీర్‌ లకు స్క్రిప్ట్ కూడా వినిపించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరు స్టార్స్ తమ నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంది. గతంలో రణబీర్‌ అనురాగ్ బసుతో కలిసి జగ్గా జాసూస్‌, బర్ఫీ సినిమాల్లో నటించాడు. దీపిక మాత్రం ఇంత వరకు అనురాగ్ దర్శకత్వంలో నటించలేదు.

 

రణబీర్ దీపికలు చివరిగా ఇంతియాజ్‌ అలి దర్శకత్వంలో తెరకెక్కిన తమాషా సినిమాలో కలిసి నటించారు. ఇక ప్రస్తుతం రణబీర్‌ భారీగా తెరకెక్కుతున్న బ్రహ్మస్త్ర సినిమాలో నటిస్తున్నాడు. దీపిక పదుకొనే ప్రస్తుతం సినిమాలకు బ్రేక్‌ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: