టాలీవుడ్లో కొన్ని హీరో, హీరోయిన్ల కాంబినేషన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఆ కాంబినేషన్లో సినిమా వస్తే ప్రేక్షకులు ఎంత ఆనందపడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి వాటిలో జగపతిబాబు, సౌందర్య కాంబినేషన్ ఒకటి. కన్నడ నుంచి వచ్చిన సౌందర్య.. ఆమె సొంత భాష లో కంటే తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. దాదాపు తెలుగు స్టార్ హీరోల అందరి సరసన నటించిన సౌందర్య అతి తక్కువకాలంలోనే ఎంతో గొప్ప పేరును సాధించింది. అలాగే విలక్షణ నటుడు జగపతి బాబుతో కూడా సౌందర్య ఎన్నో సినిమాలు నటించింది.
దొంగాట, సర్దుకుపోదాం రండి, మూడు ముక్కలాట, అల్లరి ప్రేమికుడు, భలే బుల్లోడు, పెళ్లి పీటలు, ప్రియరాగాలు ఇలా వీరిద్దరి కాంబినేషన్లో ఏ సినిమా వచ్చినా ప్రేక్షకులు నిరాజనం పట్టేవారు. జగపతిబాబు, సౌందర్య జంటగా సినిమా అంటే.. ఇక అది హిట్ అని కళ్లు మూసుకుని చెప్పేవాళ్లు. ఒక్కముక్కలో చెప్పాలంటే.. వెండి తెరపై వీరిద్దరిదీ సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. అయితే బయట కూడా అలాంటి అనుబంధమే ఉండేదని అప్పట్లో టాక్ ఉంది.
ఓ దశలో జగపతిబాబు సౌందర్యని పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడని వార్తలు వచ్చాయి. ఇక ప్రస్తుతం సౌందర్య ఇప్పుడు మన మధ్య లేరు. స్టార్ హీరోయిన్గా కెరీర్ ఫీక్స్ ఉన్న సమయంలో కేవలం 31 సంవత్సరాల వయసులోనే హెలికాప్టర్ ప్రమాదంలో 2004, ఎప్రిల్లో సౌందర్య చనిపోయింది. అభినవ మహానటిగా గుర్తింపు తెచ్చుకున్న సౌందర్య అకాల మరణం తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమను ఎంతో కృంగదీసింది. నిజంగా ఆమె మరణం తెలుగు సినీ ఇండస్ట్రీకి పెద్ద షాపం అనే చెప్పాలి.
అయితే ఆమె మరణించిన తర్వాత కూడా జగపతిబాబుతో ఎవరు పర్సనల్ ఇంటర్వ్యూ చేసినా.. సౌందర్య టాపిక్ తీసుకురావడం మాత్రం కామన్ అయిపోయింది. అయితే దీనిపై ఇటీవల జగపతి బాబు ఘాటుగానే స్పందించారు. సౌందర్యకు నాకు ఎఫైర్ ఉందని జగపతిబాబు చెప్పుకొచ్చాడు. ఎఫైర్ అంటే.. ఓ మంచి స్నేహమని, అఫైర్ అంటే కేవలం సెక్స్ ఒక్కటే కాదని, అలా ఆలోచించే వాళ్లు కచ్చితంగా పిచ్చి వాళ్లేనని స్పష్టం చేశాడు. ఏదేమైనా రీల్ లైఫ్లో మాత్రం జగపతిబాబు, సౌందర్య కాంబినేషన్ ఎప్పటికీ ఎవర్గ్రీనే అంటారు.