టాలీవుడ్ లో ఇప్పుడు రాజమౌళి హవా నడుస్తుంది. ఆయన రెండేళ్లకు సినిమా విడుదల చేసినా మూడేళ్ళకు సినిమా విడుదల చేసినా సరే ప్రేక్షకులు మాత్రం సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రోజు రోజుకి ఆయన క్రేజ్ పెరుగుతుంది గాని తగ్గడం లేదు. ప్రస్తుతం ఆయన భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ అగ్ర హీరోలు ఎన్టీఆర్ రామ్ చరణ్ తో ఆర్ఆర్ఆర్ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 

 

సినిమా షూటింగ్ ఇప్పుడు దాదాపుగా పూర్తి అయిన సంగతి తెలిసిందే. ఆయన సినిమాల మీద ఇప్పుడు రాజకీయ నాయకులు పెట్టుబడి పెట్టాలి అని భావిస్తున్నట్టు సమాచారం. రాజకీయ నాయకులు కొందరు ఆయన తో సినిమా చేయడానికి ముందుకు వచ్చారట. భవిష్యత్తులో తాము మీ సినిమాలో పెట్టుబడి పెడతాం అని మాజీ ఎమ్మెల్యేలు ఒక ఇద్దరు ఎన్టీఆర్ ద్వారా రాజమౌళిని కలిసినట్టు సమాచారం. ఏపీ నాయకులు వాళ్ళు అని సమాచారం. ఆయన సినిమాలకు మార్కెట్ భారీగా ఉంటున్న సంగతి తెలిసిందే .

 

దీనితోనే పెట్టుబడి పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ వినపడుతుంది. ఆయన కూడా ఇప్పుడు భారీ సినిమాలను వరుసగా తీసే ఆలోచనలో ఉన్న సంగతి తెలిసిందే. ఏ సినిమా చేసినా సరే భారీ బడ్జెట్ సినిమాలనే చేస్తూ వస్తున్నారు. అగ్ర హీరోలు ఆయన తో సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం తో జక్కన్న ఇప్పుడు వారి తో సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే మహేష్ బాబు తో సినిమా చేసే ఆలోచనలో ఆయన ఉన్నారని టాలీవుడ్ జనాలు అంటున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడు మార్కెట్ ఎక్కువగా పెరిగిన సంగతి తెలిసిందే. వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్నాయి సినిమాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: