ఆచార్య సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారో అందరికి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ ప్రధానంగా మెగా అభిమానులు ఎంతో ఆశగా చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు వాయిదా పడింది. కరోన అకారణంగా సినిమా షూటింగ్ ని వాయిదా వేసింది చిత్ర యూనిట్. ఎప్పుడు షూటింగ్ మొదలు పెడతారు అనేది స్పష్టత రావడం లేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వాయిదా  పడటం తో సినిమా కథలో మార్పులు చేసే బాగుంటుంది అనే భావన లో చిరంజీవి ఉన్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

 

ఆయన కు కొన్ని సన్నివేశాల మీద అభ్యంతర ఉందని వాటిని మార్చాలి అని ఆయన సూచనలు చేసినట్టు సమాచారం. ఈ గ్యాప్ లోనే కీలక పాత్రకు ఒక నటుడ్ని ఎంపిక చేసుకోవాలని, ఎన్టీఆర్ ని తీసుకుంటే ఎలా ఉంటుందా అనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ఎన్టీఆర్ ని ఇప్పటికే అడగగా అటు ఇటు గా సమాధానం చెప్పారని అంటున్నారు. మరి దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ని విదేశాల్లో చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. 

 

కాని ఆ ఆలోచనను విరమించుకున్నారు అని అంటున్నారు. విదేశాల్లో షూటింగ్ వద్దని ఆలోచనలో ఉన్నారట. అనవసరంగా ఇప్పుడు రిస్క్ వద్దని చిరంజీవి వయసు కూడా మీద పడింది కాబట్టి ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని భావించారట. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ ని తీసుకుంటారా లేక ఎన్టీఆర్ ని తీసుకుంటారా అనేది చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా లో కొన్ని కీలక పాత్రలకు సంబంధించి కొందరు నటుల పేర్లను పరిశీలిస్తున్నారని అంటున్నారు కొన్ని పాటలను యాడ్ చేసే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. కాగా ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: