ఉదయం లేవగానే ఆఫీస్ కు రెడీ అయ్యే భర్తలందరు లాక్ డౌన్ వల్ల ఇంటి నుండే వర్క్ చేస్తున్నారు. భర్తలు ఇంట్లో ఉండటాన్ని భార్యలు ఓ పక్క ఎంజాయ్ చేస్తూనే మరోపక్క పాత గొడవలను గుర్తుకుతెచ్చుకుని భర్తల మీద పాగా తీర్చుకుంటున్నారు. టాలీవుడ్ స్మాల్ స్క్రీన్ యాంకర్ లాస్య కూడా ఈ లిస్ట్ లో చేరింది. భర్త ఆఫీస్ కు వెళ్లే టైం లో హడావిడిగా కనిపించి.. అతనితోనే తిట్లు తినే లాస్య, లాక్ డౌన్ టైం లో అతనితోనే పనులు చేయించుకుంటుంది. అంతేకాదు ఈ లాక్ డౌన్ టైంలో లాస్య లేజీగా మారిందని తెలుస్తుంది. 

 

ఇదంతా ఏంటని ఆశ్చర్యపోవచ్చు.. పెళ్లి తర్వాత బుల్లితెరకు గ్యాప్ ఇచ్చిసొంతంగా యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టిన లాస్య ప్రేక్షకులను అలరిస్తుంది. లాస్య టాక్స్ తో భర్త మంజునాథ్ తో కలిసి లాస్య చేస్తున్న వీడియోలు చాలా ఎంటర్టైన్ చేస్తున్నాయి. లేటెస్ట్ గా లాక్ డౌన్ టైం లో లేజీగా మారిన భార్యల గురించి ఒక స్పెషల్ వీడియో చేసింది లాస్య. ఉదయం ఎనిమిది అవుతున్నా నిద్ర లేవని లాస్య దగ్గరకు వెళ్లి మంజునాథ్ కాఫీ అడుగుతాడు. అయితే ఆమె మరో గంట పడుకుంటానని అంటుంది. ఎప్పుడు డిమాండ్ చేసే మంజునాథ్ లాక్ డౌన్ వల్ల రిక్వెస్ట్ చేసి అడుగుతాడు. 

 

ఇక లాస్య చేయడం కుదరదని చెప్పేసరికి అతనే కాఫీ పెట్టుకునేందుకు వంట గదిలోకి వస్తాడు. అయితే కాఫీ అతనొక్కడే పెట్టుకుని తాగాలని అనుకుంటాడు. కానీ టెస్ట్ చూసిస్తా అని లాస్యకాఫీ మొత్తం తాగేస్తుంది. అలా మంజునాథ్ కు షాకులు మీద షాకులు ఇస్తుంది లాస్య. ఆమె చేసిన ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ గా మారింది. లాస్య చేస్తున్న ఈ వీడియాలు మంచి పాపులారిటీ తెచ్చుకుంటున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: