టాలీవుడ్ ఇప్పుడు కొత్త టాలెంట్ తో కళకళలాడుతుంది. రెగ్యులర్ సినిమాలకు మంగళం పాడేసి ట్రెండ్ కు తగినట్టుగా కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. స్టార్ డైరక్టర్స్ తో పాటుగా యువ దర్శకులు కూడా కొత్త కంటెంట్ తో సినిమాలు చేస్తున్నారు. అలంటి న్యూ టాలెంటెడ్ డైరక్టర్స్ లో ఒకరు స్వరూప్ ఆర్.ఎస్.జె. నవీన్ పొలిశెట్టి డైరక్షన్ లో స్వరూప్ తెరకెక్కించిన సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా. 

 

సినిమా చూసిన సినీ సెలబ్రిటీస్ కూడా ఆత్రేయ మీద ప్రశంసల వర్షం కురిపించారు. ఇక త్వరలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న స్వరూప్ తనకు ఛాన్స్ వస్తే ఎన్టీఆర్, అల్లు అర్జున్ లతో ఒక మల్టీస్టారర్ సినిమా చేస్తానని అంటున్నాడు. ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇద్దరిలో ఎనర్జీ లెవల్స్ ఒకేలా ఒకేలా ఉంటాయి. ఛాన్స్ వస్ట్ తప్పకుండా వాళ్ళిద్దరితో ఒక యాక్షన్ ప్యాక్డ్ మల్టీస్టారర్ సినిమా చేస్తా అంటున్నాడు స్వరూప్. ఒక సినిమా అనుభవమే కానీ సినిమా ఎలా తీయాలో బాగా నేర్చుకుని వచ్చినట్టు ఉన్నాడు. అందుకే ఆత్రేయ సినిమాను బాగా తీశాడు. 

 

ఇక తన ఆల్ టైం ఫెవరెట్ హీరో మెగాస్టార్ చిరంజీవి అని.. ఆయన్ను కలిస్తే చాలు అనుకోగా ఆత్రేయ సినిమాలు బెస్ట్ డెబ్యూ డైరక్టర్ గా మెగాస్టార్ దగ్గర నుండి అవార్డు అందుకోవడం ఊహించలేదని అన్నారు స్వరూప్. ఛాన్స్ వస్తే చిరుని కూడా డైరెక్ట్ చేస్తా అంటున్న స్వరూప్ మొత్తానికి చాల పెద్ద ప్లానింగ్ లోనే ఉన్నాడని తెలుస్తుంది. నానితో ఒక సినిమా ప్లానింగ్ లో ఉన్న స్వరూప్ రాబోయే రోజుల్లో స్టార్ డైరక్టర్ అవుతాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.        

 

మరింత సమాచారం తెలుసుకోండి: