సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మూడు నెలలు గ్యాప్ తీసుకుందామనుకున్న తరుణంలో కరోనా వైరస్ రావడంతో మరో మూడు నెలలు పొడిగించినట్టు అయింది. దాంతో అప్పటికే వంశీ పైడిపల్లి ప్రాజెక్టు ఓకే అనుకున్నా, సెకండాఫ్ స్క్రిప్ట్ సరిగ్గా లేకపోవడంతో ఆ సినిమాని పక్కన పెట్టడం జరిగింది. ఇటువంటి సందర్భం గీతా గోవిందం డైరెక్టర్ పరశురామ్ పేరు తెరపైకి వచ్చింది.  ప్రస్తుతం పరశురామ్ మహేష్ బాబు కోసం స్టోరీ సిద్ధం చేస్తున్నారట. స్టోరీ ప్రిపరేషన్ లోనే ఉండటంతో ఎక్కడా ఖరారు చేయకపోవడంతో మహేష్ బాబు నెక్స్ట్ సినిమాపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

 

ఇటువంటి సందర్భంలో ఫిలింనగర్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు కి పరశురామ్ స్టోరీ చాలావరకు ఓకే అయినట్లు కానీ ఎక్కువ భాగం ఇతర దేశాలలో షూట్ చేయాల్సి ఉంటుందట. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ రాకతో అబ్రాడ్ లో షూటింగ్ అంటే చాలా కష్టం కాబట్టి ఆ స్టొరీ ని పక్కన పెట్టి లోకల్ లో తీయగలిగే ఒక ప్యూర్ మెచ్యూర్డ్ లవ్ స్టోరీ రాయమని చెప్పారట. ప్రస్తుతం ఆ పనిలో పరశురామ్ ఉన్నాడని సమాచారం.

 

ప్రేమ కథ అదిరిపోవాలి ఒకపక్క క్లాసికల్ గా మరోపక్క హీరోయిజం ఉండేవిధంగా స్టోరీ సిద్ధం చేయాలని అలాంటి కథ ఓకే అయితే సంతకం పెట్టడానికి కూడా మహేష్ రెడీగా ఉన్నారట. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. దీంతో ‘గీత గోవిందం’తో ప్రేమకథని అద్భుతంగా చెప్పిన పరశురామ్ మహేష్ కోసం న్యూ ఏజ్ లవ్ స్టోరీ రాసే పనిలో ఉన్నారట. అన్నీ ఓకే అయితే కృష్ణ గారి బర్త్ డే కానుకగా మే 31న ఈ సినిమాని అధికారికంగా లాంచ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: