టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు టైం నడుస్తుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. భరత్ అనే నేను, మహర్షి తాజాగా 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలతో వరుసగా 3 బ్లాక్ బస్టర్ విజయాలతో తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా 'సరిలేరు నీకెవ్వరు' సినిమా రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు కొత్త ఏడాది మహేష్ సరికొత్త ఓపెనింగ్ చేశారు. గతంలో మహేష్ బాబు 25వ సినిమాగా మహర్షి సినిమా చేసి మంచి విజయం సాధించిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 27వ సినిమా ఉంటుందని అందరూ భావించారు. అయితే సినిమాకి సంబంధించిన స్క్రిప్టు సరిగ్గా లేకపోవడంతో వంశీ సినిమాని మహేష్ పక్కన పెట్టడం జరిగింది.

 

అయినా కానీ మహేష్ బాబు తో ఏదో రకంగా సినిమా చేయాలని వంశీ పైడిపల్లి స్క్రిప్టులో అనేక మార్పులు చేసినా గాని పెద్దగా నచ్చలేదు. పైగా నెక్స్ట్ సినిమా కూడా మహేష్ స్టార్ట్ చేయలేని సందర్భం ఏర్పడటంతో మహేష్ అభిమానులు వంశీ పై సోషల్ మీడియాలో చిరాకు పడ్డారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్‌ బాబు సినిమాపై వంశీ ఆశలు వదిలేసినట్లుగా తెలుస్తోంది.

 

ప్రస్తుతం ఎన్టీఆర్‌ కోసం బృందావనం సినిమాకు సీక్వెల్‌ స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న 'RRR' సినిమా అయిన వెంటనే త్రివిక్రమ్ సినిమా తర్వాత వచ్చే ఏడాది వంశీ సినిమా ఎన్టీఆర్ స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం. న్యూస్ కన్ఫామ్ కావటంతో మహేష్ బాబు అభిమానులు రిలీఫ్ అవుతున్నారట. అబ్బబ్బ ఎన్నాళ్ళకి మహేశ్ ని వదిలేశాడు అని మరి కొంతమంది అభిమానులు ఫీల్ అవుతున్నారట. మరోపక్క మహేష్... పరశురామ్ దర్శకత్వం లో ఓ కొత్త లవ్ స్టోరీ సినిమా చేయనున్నారు అని ఫిలిం నగర్ టాక్.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: