బాహుబలి ద్వారా సెన్సేషన్ ని క్రియేట్ చేసిన రాజమౌళి ప్రస్తుతం మరో సెన్సేషన్ ని క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే, ఆర్.ఆర్.ఆర్ అనే పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి రౌద్రం, రణం, రుధిరం అనే నిర్వచనాన్ని ఇచ్చాడు రాజమౌళి. నిజ జీవిత పాత్రలని తీసుకుని కల్పిత కథని జోడించి మన ముందుకు తీసుకువస్తున్నాడు.

 

రామ్ చరణ్ పుట్టినరోజుని పురస్కరించుకుని అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్ ని రివీల్ చేశాడు. అయితే అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్ విడుదల చేసినప్పటి నుండి, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుందో చూడాలన్న ఆసక్తి మరింత ఎక్కువైంది. ఈ లుక్ గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ పుట్టినరోజున కొమరం భీమ్ ని మనకి పరిచయం చేస్తారా లేదా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు.

 

ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా రాజమౌళి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు. ఆ ఇంటర్వ్యూల్లో తన తర్వాతి ప్రాజెక్ట్ మహేష్ తో ఉంటుందని కన్ఫర్మ్ చేశాడు. అయితే అప్పటి నుండి మహేష్- రాజమౌళి కాంబినేషన్లో వచ్చే సినిమా గురించి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమా జేమ్స్ బాండ్ తరహా సినిమా అయ్యుంటుందని, థ్రిల్లర్ కథాంశంతో రాజమౌళి మన ముందుకు వస్తున్నాడని అంటున్నారు.

 

అయితే వీటన్నింటినీ చూసిన రాజమౌళి, ఇక నుండి సైలెంట్ గా ఉండడమే బెటర్ అని అనుకుంటున్నాడట. ఆర్.ఆర్.ఆర్ పూర్తి కాకముందే నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేయడం వల్ల ఫోకస్ మొత్తం ఆర్.ఆర్.ఆర్ నుండి షిఫ్ట్ అయ్యి అటువైపు వెళ్ళిందన్న కారణంతో, ఇక నుండి తన తర్వాతి ప్రాజెక్టుకి సంబంధించిన ఏ విషయమూ మాట్లాడకూడదని డిసైడ్ అయ్యాడట. మరి విలేకరుల ప్రశ్నలని ఎలా దాటవేస్తాడో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: