2020 ఏడాది ప్రారంభంలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి 'బ్లాక్ బస్టర్ కా బాప్' అనిపించుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'సరిలేరు నీకెవ్వరు' మహేష్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందుకుంది. కొన్ని ఏరియాస్ లో బాహుబలి 2 రికార్డులను కూడా బ్రేక్ చేసింది. మాస్ అండ్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచింది. మహేష్ సరసన హీరోయిన్ గా రష్మిక మందన్న మొదటిసారి నటించింది. చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఓ కీలక పాత్ర చేయడం విశేషం. అంతేకాకుండా ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత, హరితేజ, అజయ్, రఘుబాబు, జయప్రకాశ్ రెడ్డి, మురళీ శర్మ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. 14 రీల్స్ బ్యానర్ మరియు ఎంబీ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 

 

ఇదిలా ఉండగా ఈ చిత్రంలోని ‘హి ఈజ్ సో క్యూట్’ లిరికల్ సాంగ్ వీడియో యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ దక్కించుకొని దుమ్ము రేపింది. సరిలేరు నీకెవ్వరు మూవీ ఆల్బమ్ లో బెస్ట్ సాంగ్స్ లో ఒకటిగా ఉన్న ఈ సాంగ్ విశేష ఆదరణ దక్కించుకొని 100 మిలియన్ మ్యాజిక్ ఫిగర్ ని చేరుకుంది. దేవిశ్రీ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ కి శ్రీమణి లిరిక్స్ అందించగా.. మధు ప్రియా ట్రెండీగా పాడి ఆకట్టుకుంది. ఈ పాటకి శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించాడు. 

 

IHG

 

కాగా మహేష్ తన కెరీర్లో 27వ చిత్రంగా తెరకెక్కబోతున్న సినిమాకి 'గీతగోవిందం' ఫేమ్ పరశురామ్ దర్శకత్వం చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ హీరోయిన్స్ కియారా అద్వానీ లేదా సారా అలీఖాన్ మహేష్ తో రొమాన్స్ చేసే అవకాశాలున్నాయని సమాచారం. మే 31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా అధికారికంగా సినిమా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాని 14 రీల్స్ మరియు మైత్రీ మూవీ మేకర్స్, ఎంబీ ప్రొడక్షన్స్ కలిసి నిర్మించనున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: