డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన 'సరిలేరు నీకెవ్వరూ' చిత్రం ద్వారా అసలు సిసలైన విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో మోస్ట్‌ వాంటెడ్‌ దర్శకుల లిస్టులో తన పేరు చేరిపోయింది. కమెర్షియల్ సినిమాలకి తనదైన కామెడీని జోడించి ప్రేక్షకులను మెప్పించడం ఈ డైరెక్టర్ స్టైల్. 2019 సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రుణ్‌తేజ్ హీరోలుగా తెర‌కెక్కిన మ‌ల్టీస్టార‌ర్ చిత్రం 'ఎఫ్‌2'. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. త‌మ‌న్నా, మెహ‌రీన్ హీరోయిన్‌లుగా న‌టించిన ఈ చిత్రం గ‌త ఏడాది సంక్రాంతికి విడుద‌లై వ‌ర‌ల్డ్ వైడ్‌గా వంద కోట్లు వ‌సూలు చేసి శభాష్ అనిపించుకుంది. ఈ సినిమా ఎండింగ్‌లోనూ సీక్వెల్ ప్లాన్స్ వున్న‌ట్టు హింట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు ప్ర‌స్తుతం అదే ప‌నిలో బిజీగా వున్నాడు.

 

ఇటీవ‌ల మీడియా ఇంట‌రాక్ష‌న్‌లో ఇప్పటికే ఈ చిత్రానికి సీక్వెల్ 'ఎఫ్ 3'కి సంబంధించిన స్క్రిప్ట్‌ని సిద్ధం చేసే ప‌నిలో బిజీగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. ఐతే ఈ చిత్రంలో మరో హీరో ఉంటాడని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుండగా అనిల్ దానిపై హింట్ ఇచ్చారు. మరో హీరో ఉండడం ఖాయం అన్న అనిల్ అది ఎవరనేది సర్ప్రైజ్ అన్నారు. కాగా ఆ మూడో పాత్ర జస్ట్ గెస్ట్ రోల్ మాత్రమే అని ఆయన మాటలను పరిశీలిస్తే తెలుస్తుంది. కాబట్టి ఎఫ్ 3లో స్టార్ హీరో క్యామియో రోల్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే ఈ సీక్వెల్‌ లో వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌, త‌మ‌న్నా, మెహ‌రీన్‌ కంటిన్యూ అవుతారని క్లారిటీ ఇచ్చాడు. ఈ రెండు సినిమాలు ఆగష్టు సమయానికి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయట. దిల్ రాజు - అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ని ఆగష్టు నెల నుండి మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: