కరోనా వైరస్ ని కట్టడి చేయడం అనేది అంత ఈజీ కాదు. దానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎన్ని హెచ్చరికలు చేసినా సరే తక్కువే. ఏదోక రూపంలో మన మీద దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేది ఎవరూ కాదు అనలేని వాస్తవం. కరోనా మహమ్మారి దెబ్బకు చాలా మంది దేశాధినేతలు కూడా భయపడిపోయి దాక్కున్న సందర్భాలు కూడా ఉన్నాయి అనేది స్పష్టంగా అర్ధమవుతుంది. ఇక కరోనా విషయంలో మన తెలుగు హీరోలు ఎప్పటికప్పుడు అభిమానులకు ఎన్నో జాగ్రత్తలు చెప్తూ వస్తున్నారు. చిన్న హీరో నుంచి పెద్ద హీరో వరకు ఏదోక సూచన చేస్తూనే ఉన్నారు ఫాన్స్ కి. 

 

ఇందులో ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి రామ్ చరణ్, ఇలా అందరూ కూడా తమకు తోచిన విధంగా అభిమానులకు సూచనలు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి అయితే సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఏదోక సూచన చేస్తూనే ఉన్నారు. ఏదోక జాగ్రత్తలు చెప్తూనే వస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన చెప్తున్నా సూచనలు బాగా వైరల్ అవుతున్నాయి అనేది వాస్తవం. తాజాగా చిరంజీవి కొన్ని వీడియో లను విడుదల చేసారు అందులో ఆయన శానిటేషన్ చేసుకున్న  విధానం చూపించారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న రామ్ చరణ్ ఎన్టీఆర్ కూడా ఇదే స్థాయిలో జాగ్రత్తలు చెప్తున్నారు. 

 

సోషల్ మీడియాలో వీరి వీడియో లకు ఇప్పుడు మంచి ఆదరణ ఉంది. తమ అభిమానుల ప్రాణాలు కాపాడుకోవడానికి తమ వంతుగా వాళ్ళు సహాయం చేస్తున్నారు. ఆర్ధిక సహాయం మాత్రమే కాదు ఇలాంటివి కూడా తాము చేయడానికి ముందు ఉంటాం అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. టాలీవుడ్ లో అందరూ కూడా ఇప్పుడు ఏదోక జాగ్రత్త చెప్తూనే ఉన్నారు అనేది వాస్తవ౦. ఇలాగే ఈ నాలుగు రోజులు చెప్పి ప్రభుత్వాలకు సహకరించాలని అందరూ కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: