ఇప్పుడు ప్రజలకు సహాయం చేయడం అనేది చాలా అవసరం. లేకపోతే కరోనా నుంచి బయటకు రావడం అనేది వారికి చాలా కష్టం. లాక్ డౌన్ లో చాలా మంది ఆకలికి చనిపోయే పరిస్థితి దేశ వ్యాప్తంగా ఉంది. కరోనా రాకముందే ఆకలి తో చనిపోయే వారు ఎక్కువగా ఉన్నారని చాలా మంది హెచ్చరికలు చేస్తున్నారు. దీనితో ఇప్పుడు ఇండియన్ సినిమా వారికి అండగా నిలుస్తుంది. సినిమా కార్మికుల కోసం ఎక్కువగా సహాయ సహకారాలను అందిస్తున్నారు మన వాళ్ళు. లేని వాళ్ళ కోసం ఆర్ధిక సహాయం చేస్తున్నారు. హింది నుంచి తెలుగు వరకు ఇదే జరుగుతుంది. 

 

లక్షల రూపాయలను ఈ విధంగా సహాయం కోసం కేటాయిస్తున్నారు. ఇందులో ప్రధానంగా చెప్పుకునేది హీరోయిన్ ల గురించి బాలీవుడ్ లో ప్రియంక చోప్రా మన తెలుగులో ప్రణీత రకుల్ ప్రీత్ సింగ్ అందరూ కూడా పేదల ఆకలి తీర్చడానికి కృషి చేస్తున్నారు. వీరికి సంబంధించిన ఫోటో లు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. పేదలకు సహాయం చేయడానికి గానూ తమ స్థాయిని తగ్గించుకుని వంట కూడా చేస్తున్నారు. ఇది నిజంగా అభినందించే పరిణామ౦ గా చెప్పుకోవచ్చు. టాలీవుడ్ హీరోల్లో ప్రభాస్ పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ఇలా వారి సహాయ౦ వారు చేసారు. 

 

హీరోయిన్ లు ప్పుడు వంటలు వండి వాటిని అందించే కార్యక్రమం చేస్తున్నారు. ఇలా పేదల కడుపులు నింపడానికి గానూ తమ వంతు కృషి చేస్తున్నారు భవిష్యత్తులో కూడా తమ వంతుగా సహాయం చెయ్యాలని అభిమానులను ప్రేక్షకులను పేద వారిని ఆదుకుని వారి కోసం మంచి కార్యక్రమాలు చెయ్యాలని కరోనా పోరాటం లో ఇప్పుడు మనిషి గెలిచి నిలబడితే కొత్త జీవితాన్ని మొదలుపెట్టే అవకాశం ఉంటుంది అంటూ పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఎవరికి వారుగా సహాయం చెయ్యాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: