మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో మహేష్ ఓ కీలకమైన రోల్ చేయబోతున్నాడని పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి చిరంజీవి అతిధిగా వచ్చినప్పటి నుండి వీరిద్దరూ కలిసి ఆచార్య సినిమాలో నటించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలన్నీ వట్టి పుకార్లేనని ఆచార్యలోని కీలకమైన పాత్రని రామ్ చరణ్ చేస్తున్నాడని చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.

 

అయితే తాజగా మరో కొత్త పుకార్లు షికారు చేస్తుంది. మహేష్ నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుందని అంటున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత వంశీపైడిపల్లి దర్శకత్వంలో సినిమా క్యాన్సిల్ అయ్యాక, గీతగోవిందమ్ దర్శకుడు పరశురామ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై లాక్డౌన్ తర్వాత అధికారిక ప్రకటన రానుంది. అయితే మహర్షి సినిమా తర్వాత మళ్లీ మహేష్ తోనే సినిమా చేద్దామనుకున్న వంశీకి, మహేష్ క్యాన్సిల్ చేయడంతో షాక్ తగిలినట్టు అయింది.

 


అయితే మమర్షి సినిమా టైమ్ లో మహేష్, వంశీల మధ్య మంచి స్నేహం కుదిరిన సంగతి తెలిసిందే. ఆ స్నేహం కారణంగానే రామ్ చరణ్ హీరోగా తెరకెక్కే సినిమాకి మహేష్ నిర్మాతగా వ్యవహరిస్తాడని అంటున్నారు. రామ్ చరణ్ కి ఎవడు సినిమాతో మంచి హిట్ అందించాడు వంశీ. ఆ నమ్మకంతోనే రామ్ చరణ్ కి కథ వినిపించడానికి వంశీ సిద్ధంగా ఉన్నాడట. అయితే ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు.

 


అలాగే ఆచార్యలో కీలకమైన పాత్ర కూడా చేయాల్సి ఉంది. అవన్నీ కుదురుకుని రామ్ చరణ్ ఖాళీగా దొరకాలంటే చాలా టైమ్ పడుతుంది. అదీగాక జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేయడానికి రామ్ చరణ్ ఆసక్తిగా ఉన్నాడు. మరి ఇవన్నీ పూర్తయ్యి మహేష్ నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా వంశీ దర్శకత్వంలో సినిమా తెరకెక్కాలంటే చాలా టైమ్ పట్టేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: