పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే రాజకీయాల్లో అడుగు పెట్టారో అప్పటి నుండి తనను విమర్శించే వాళ్ళు విపరీతంగా పెరిగిపోయారు. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ రంగం కాబట్టి ఒక సినిమాలో పవన్ మంచిగా చేసినా చేయకపోయినా... సినిమా ఆడినా ఆడకపోయినా తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాదు. కానీ ఒక్కసారి రాజకీయ రంగంలోకి అడుగు పెడితే ఎన్నో సమస్యలు అడ్డంకులు విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అందరికంటే ఎక్కువగా విమర్శలను ఫేస్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫిలిమ్ క్రిటిక్ కత్తి మహేష్, క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమ రాణి శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ ని ప్రతిరోజు పచ్చి బూతులు తిడుతూ ఎవరూ భరించలేనటువంటి విమర్శలు చేస్తుంటారు.


అయితే తాజాగా ఆన్లైన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి పవన్ కళ్యాణ్ గురించి చాలా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ వెంట తాము ఉన్నామని... ఆయన జోలికి వచ్చిన ఎంతటి వాడికైనా తాటతీస్తామని ఆమె తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. కళ్యాణ్ బాబు గురించి మొరుగుతున్న కుక్కలకి సరైన సమాధానం త్వరలోనే చెబుతామని ఆమె అన్నారు. రాకేష్ మాస్టర్, శ్రీ రెడ్డి లాంటి వారు కావాలనే పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ తమ పాపులారిటీని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె తెలిపింది. ఎవడో తిట్టాడని పవన్ స్పందించి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదని... మొరిగే కుక్కలకు బుద్ధి చెప్పడానికి తాము చాలని ఆమె అన్నారు.


శ్రీ రెడ్డి ఒక మహిళ కాబట్టి ఆమెను ఏమీ అనలేక పోతున్నామని... లాక్ డౌన్ ఎత్తేసిన అనంతరం పవన్ పై విమర్శలు చేసే ప్రతి ఒక్కరిని చెప్పుతో కొడతా అని ఆమె ఫైర్ అయ్యింది. జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బు వినియోగిస్తున్నారని... జయాపజయాలతో పని లేకుండా ప్రజల సంక్షేమం కొరకు ప్రజల సమస్యలపై ప్రతిరోజు పోరాడుతున్నారని ఆమె చెప్పుకొచ్చింది. పోయిన ఎన్నికలలో తనకి జనసేన పార్టీ తరఫున ఒక టిక్కెట్టు లభిస్తుందని ఆశించానని కానీ టికెట్టు రాకపోవడంతో మరే ఇతర పార్టీలో చేరేందుకు ఇష్టంలేక ఇండిపెండెంట్ గా పోటీ చేశానని తెలిపింది. అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ తను జనసేన పార్టీకి మద్దతు తెలుపుతామని, పవన్ కళ్యాణ్ అభిమాని లాగే ఎప్పటికీ ఉండిపోతానని ఆమె తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: