అర్జున్ రెడ్డి' సినిమాతో మంచి హిట్ అందుకొని అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాతో అటు విజయ్ క్రేజు  ఇటు సందీప్ రేంజు రెండు పెరిగాయి. ఆ తర్వాత అర్జున్ రెడ్డిని హిందీలో 'కబీర్ సింగ్' గా రీమేక్ చేసాడు. ఈ సినిమా అక్కడ కూడా బ్లాక్ బాస్టర్ అయ్యింది. దాంతో ఈ డైరెక్టర్ తెలుగులోకంటే హిందీలో నే ఎక్కువ అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇటీవలే బాలీవుడ్ లో కబీర్ సింగ్‌తో హిట్ పట్టేసిన సందీప్ రెడ్డి వంగా.. తన తదుపరి సినిమాను కూడా బాలీవుడ్ లోనే చేయాలనుకున్నాడు. ఈ మేరకు సూపర్ స్టార్ రణ్ బీర్ కపూర్‌తో పక్కా క్రైమ్ డ్రామా రూపొందించాలని ఫిక్స్ అయ్యాడు. దీనికి 'డెవిల్' అనే టైటిల్ కూడా అనుకున్నారట. అసలైన క్రైమ్ సినిమా అంటే ఎలా ఉంటుందో ఈ చిత్రంతో చూపిస్తానని ఛాలెంజ్ కూడా చేశాడు సందీప్ రెడ్డి వంగా. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రణ్ బీర్ కపూర్‌ ఈ సినిమా చేయడం లేదని చెప్పాడు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా అని.. మళ్ళీ విజయ్ దేవరకొండ తో సినిమా అని రకరాలుగా వార్తలు వచ్చాయి. కానీ ఏవీ నిజం కాలేదు. దీంతో సందీప్ వంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఒక కథ చెప్పాడన.. ఆ కథ ఆసక్తికరంగా ఉండడంతో ప్రభాస్ కి బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. కానీ అది కూడా పుకారేనని తెలుస్తోంది.

 

అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం సందీప్ రెడ్డి మళ్ళీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలని కోరుకుంటున్నాడట. దీనికోసం ఇప్పటికే రెడీగా ఉన్న స్క్రిప్ట్ తో మహేష్ ని కన్విన్స్ చేయాలని అనుకుంటున్నాడట. లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే మహేష్ ని కలిసి స్టోరీ నారేట్ చేయబోతున్నాడట. అయితే ఇప్పటికే ఒకసారి ఓకే అనుకున్న ప్రాజెక్ట్ దూరమయింది. మళ్ళీ ఇప్పుడు కలవబోతున్నారంటూ న్యూస్ వస్తోంది. ఒకేవేళ ఇదే కనుక నిజమైతే వీరి కాంబోలో నెక్స్ట్ లెవెల్ సినిమాగా ఉంటుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ వార్త లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మరి కొంత కాలం ఎదురు చూడాల్సిందే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: