క‌రోనా కార‌ణంగా ఎక్క‌డివారు అక్క‌డే నిర్బంధ‌న‌లోకి వెళ్ళిపోయారు. ఎప్పుడూ క‌ళ‌క‌ళ‌లాడుతూ ఉండే సినీ ఇండ‌స్ట్రీ మొత్తం ఎక్క‌డిక‌క్క‌డ షూటింగ్‌లు లేకుండా బోసిపోయింది. వ్యాధి ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల లాక్‌డౌన్ మ‌రికొన్ని రోజుల పాటు ఎక్కువ‌గా పొడిగిస్తున్నట్లు స‌మాచారం. ఇక లాక్‌డౌన్‌లో ఉన్న మ‌న టాలీవుడ్ స్టార్స్ మాత్రం త‌మ త‌మ సోష‌ల్ మీడియా ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు ఫ్యాన్స్‌తో తాము ఇంట్లో చేసే ప‌నుల గురించి వీడియోలు, ఫొటోలు తీసి పోస్ట‌లు పెడుతూనే ఉన్నారు. 

 

ఈ నేప‌ధ్యంలోనే ఓ వారం రోజులు టాలీవుడ్ లో రియల్ మెన్ ఛాలెంజ్ హల్ చల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ బుర్రలో పుట్టిన రియల్ మెన్ ఛాలెంజ్ కి రాజమౌళి, ఎన్టీఆర్, చిరంజీవి లాంటి బడా సెలెబ్రిటీలు సైతం స్పందించడంతో ఇది బాగా ఫేమస్ అయ్యింది. ఐతే ఈ ఛాలెంజ్ మూడవ ఫేజ్ లో విఫలం చెందింది. చిరు, వెంకీ, ఎన్టీఆర్ లు ఛాలెంజ్ చేసిన కొందరు హీరోలు దీనికి స‌రిగా స్పందించలేదు. ముఖ్యంగా టాలీవుడ్ టాప్ స్టార్స్ మహేష్, ప్రభాస్ కూడా దీన్ని లైట్ గా తీసుకున్నారు.

 

వెంకటేష్ ఎన్టీఆర్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి పూర్తి కూడా చేశారు. అలాగే ఆయన మహేష్ ని ఈ ఛాలెంజ్ కి నామినేట్ చేయడం జరిగింది. మహేష్ ఈ ఛాలెంజ్ పూర్తి చేయలేదు. ఇక హీరో ప్రభాస్ ని బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ నామినేట్ చేశారు. ప్రభాస్ సైతం ఈ ఛాలెంజ్ ని పట్టించుకోలేదు. మహేష్, ప్రభాస్ లు ఈ ఛాలెంజ్ పూర్తి చేయకపోవడానికి కారణం ఏమిటో తెలియలేదు. అలాగే నాగ్, బాలయ్య, రవితేజ, వరుణ్ తేజ్ వంటి వారు కూడా ఈ లిస్టులో ఉన్నారు. కానీ వారు కూడా ఇంకా ఎవ్వ‌రూ బ‌య‌ట‌కు రాలేదు. ఇక మ‌హేష్‌, ప్ర‌భాస్ లు ఇలాంటి వాటికి కాస్త దూరంగా ఉంటార‌ని అర్ధ‌మ‌వుతుంది. ఇక నాగార్జున అన్నా ఏద‌న్నా ఒక క‌రోనా ప్ర‌చారంలో భాగ‌మ‌య్యారు కాని బాల‌కృష్ణ అయితే ఇలాంటి వాటికి పూర్తి దూరం అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: